మాజీ మంత్రి సునీతా లక్ష్మారెడ్డి అరెస్ట్

Published : Aug 15, 2018, 03:27 PM ISTUpdated : Sep 09, 2018, 12:21 PM IST
మాజీ మంత్రి సునీతా లక్ష్మారెడ్డి అరెస్ట్

సారాంశం

144 సెక్షన్ అమలులో ఉన్నందున కార్యక్రమాన్ని నిర్వహించవద్దని పోలీసులు తెలిపారు. దీంతో సునీతారెడ్డి ఆధ్వర్యంలో అంబేద్కర్‌చౌరస్తాలో కాంగ్రెస్ నేతలు ధర్నా చేపట్టారు. 

మెదక్ జిల్లా నర్సాపూర్ లో మాజీ మంత్రి సునీతా లక్ష్మారెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు.నర్సాపూర్‌లో సునీతారెడ్డి భర్త లక్ష్మిరెడ్డి వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించాలని భావించారు. అయితే.. ఆ కార్యక్రమాన్ని పోలీసులు అడ్డుకున్నారు. 

144 సెక్షన్ అమలులో ఉన్నందున కార్యక్రమాన్ని నిర్వహించవద్దని పోలీసులు తెలిపారు. దీంతో సునీతారెడ్డి ఆధ్వర్యంలో అంబేద్కర్‌చౌరస్తాలో కాంగ్రెస్ నేతలు ధర్నా చేపట్టారు. వారిని అడ్డుకున్న పోలీసులు సునితారెడ్డి సహా పలువురిని అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా సునితారెడ్డి మాట్లాడుతూ రాజకీయంగా ఎదుర్కొనే దమ్ము లేక తనపై కక్ష సాధింపు చర్యలకు దిగుతున్నారని, టీఆర్‌ఎస్ నాయకులు పిరికి పందలని వ్యాఖ్యానించారు.

PREV
click me!

Recommended Stories

పెట్రోల్ సంక్షోభం రానుందా.? ఎందుకీ భారీ క్యూలు.? | Asianet News Telugu
Rain Alert: వ‌చ్చే 3 రోజులు ద‌బిడి దిబిడే.. ఈ ప్రాంతాల్లో భారీ వ‌ర్షాలు. ఎల్లో అల‌ర్ట్ జారీ