రోడ్డు ప్రమాద బాధితులను పరామర్శించిన ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి

Siva Kodati |  
Published : Nov 03, 2022, 05:25 PM IST
రోడ్డు ప్రమాద బాధితులను పరామర్శించిన ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి

సారాంశం

ధారూర్ మండలం బాచారం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడిన పెద్దెముల్ మండల బాధితులను మాజీ మంత్రి, ఎమ్మెల్సీ డాక్టర్ పట్నం మహేందర్ రెడ్డి గురువారం పరామర్శించారు. మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభుతి ప్రకటించిన ఆయన.. బాధిత కుటుంబాలను ప్రభుత్వపరంగా ఆదుకుంటామని మహేందర్ రెడ్డి హామీ ఇచ్చారు. 

ధారూర్ మండలం బాచారం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడిన పెద్దెముల్ మండల బాధితులను మాజీ మంత్రి, ఎమ్మెల్సీ డాక్టర్ పట్నం మహేందర్ రెడ్డి గురువారం పరామర్శించారు. కూలి కోసం వికారాబాద్‌కు ఆటోలో వెళ్తుండగా జరిగిన ప్రమాదం పట్ల విచారం వ్యక్తం చేశారు మహేందర్ రెడ్డి. ప్రమాదంలో నలుగురు మృతి చెందగా మరో నలుగురు గాయాలపాలైయ్యారు. గాయపడిన బాధితులను హైదరాబాద్ నిమ్స్‌కు తరలించగా అక్కడ వారిని పరామర్శించారు మహేందర్ రెడ్డి. ఈ సందర్భంగా సరైన వైద్యం అందించాలని వైద్యులను ఆదేశించారు మహేందర్ రెడ్డి. మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభుతి ప్రకటించిన ఆయన.. బాధిత కుటుంబాలను ప్రభుత్వపరంగా ఆదుకుంటామని మహేందర్ రెడ్డి హామీ ఇచ్చారు. 

 

PREV
click me!

Recommended Stories

School Holidays : తెలుగు స్టూడెంట్స్ ఎగిరిగంతేసే వార్త... డిసెంబర్ 16,17 రెండ్రోజులు సెలవే
IMD Cold Wave Alert : గజగజా వణికిపోతున్న తెలుగు రాష్ట్రాలు... ఈ చలి తీవ్రత తగ్గేదెన్నడో తెలుసా?