పొన్నాల భూ కబ్జాకు పాల్పడ్డారా ?

Published : Feb 27, 2017, 10:35 AM ISTUpdated : Mar 24, 2018, 12:13 PM IST
పొన్నాల భూ కబ్జాకు పాల్పడ్డారా ?

సారాంశం

కబ్జా ఆరోపణలొచ్చిన ప్రాంతాలను పరిశీలించిన సభాసంఘం

 

పీసీసీ మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య భూ ఆక్రమణలపై గత కొంతకాలంగా ఆరోపణలు వినిపిస్తున్నాయి.

 

వరంగల్ నుంచి హైదరాబాద్ రహదారి మధ్యలో చాలా చోట్ల ఆయనకు తిరుమల హెచ్చరీస్ పేరుతో భారీ స్థాయిలో పౌల్ట్రీఫాంలున్నాయి.

 

అయితే ఆయన వైఎస్ హయాంలో ఉన్నప్పుడు తన కంపెనీ కోసం పలు చోట్ల భూ ఆక్రమణలకు పాల్పడినట్లు ఆరోపణలు వినవచ్చాయి. దీనిపై గతంలోనే ప్రభుత్వం సభాసంఘం ఏర్పాటు చేసింది.

 

వరంగల్ జిల్లా ధర్మసాగర్ మండలం రాంపూర్ గ్రామ పరిధిలో అలాగే, తిమ్మాపూర్ గ్రామంలో ఈ రోజు ఆ సభాసంఘం పర్యటించింది.

 

పొన్నాల ఆక్రమించినట్లుగా చెబుతున్న 8 ఎకరాల 39 గుంటల భూమిని పరిశీలించింది.

 

వైఎస్ హయాంలో మంత్రిగా ఉన్న పొన్నాల అధికార దుర్వినియోగానికి పాల్పడి…. దళితులకు కేటాయించిన అసైన్డ్ భూమిని తిరుమల హేచరీస్ పేరుతో ఆక్రమించినట్లు ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి ఆధ్వర్యంలో సభాసంఘం తిరుమల హేచరీస్ భూముల పై సర్వే చేసి విచారణ జరిపింది.


అయితే విచారణ వివరాలను ఇంకా మీడియాకు వెల్లడించలేదు.

PREV
click me!

Recommended Stories

IMD Rain Alert : ఇక కుండపోత వానలే... తెలుగు రాష్ట్రాల్లో అతలాకుతలమే
Rashmika Mandanna Speeh: లైఫ్ అంటే అదే.. స్టేజిపై స్పీచ్ ఇరగదీసిన రష్మిక | Asianet News Telugu