మెడికల్ సీట్ల స్కాంలో దర్యాప్తు ముమ్మరం: మల్లారెడ్డి సహా పలు కాలేజీలకు నోటీసులివ్వనున్న ఈడీ

Published : Jul 07, 2023, 10:30 AM IST
 మెడికల్ సీట్ల స్కాంలో దర్యాప్తు ముమ్మరం:  మల్లారెడ్డి సహా పలు కాలేజీలకు  నోటీసులివ్వనున్న ఈడీ

సారాంశం

మెడికల్ కాలేజీ స్కాంలో  పలు  మెడికల్ కాలేజీలకు  ఈడీ అధికారులు నోటీసులు  ఇవ్వనున్నారు.


హైదరాబాద్: మెడికల్ కాలేజీల్లో సీట్ల స్కాంపై  ఈడీ అధికారులు దర్యాప్తు ముమ్మరం  చేయనున్నారు.2016 నుండి  2022 వరకు  మెడికల్ కాలేజీల్లో ఆడ్మిషన్ల విషయంలో స్కాం జరిగిందని  అందిన ఫిర్యాదు మేరకు ఈడీ అధికారులు  గత మాసంలో రాష్ట్రంలోని పలు  మెడికల్ కాలేజీల్లో సోదాలు నిర్వహించారు.  కీలకమైన పత్రాలు, నగదును  స్వాధీనం  చేసుకున్నారు. రాష్ట్రంలోని ఆరు మెడికల్ కాలేజీల్లో  ఈడీ అధికారులు  సోదాలు  నిర్వహించారు. ఈ ఏడాది జూన్  21న  మెడికల్ కాలేజీల్లో  ఈడీ అధికారులు సోదాలు  నిర్వహించారు. 

హైద్రాబాద్ సూరారంలోని  మల్లారెడ్డి  ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్, మహాబూబ్ నగర్ లోని ఎస్‌వీఎస్ మెడికల్ కాలేజీ,  సంగారెడ్డిలోని ఎంఎన్ఆర్ మెడికల్ కాలేజీ , శామీర్ పేటలోని మెడిసిటీ   కాలేజీ, చల్మెడ ఆనందరావు  మెడికల్ కాలేజీల్లో  ఈడీ సోదాలు  నిర్వహించింది.  

ప్రైవేట్ మెడికల్ కాలేజీల  నిర్వాహకులు  పీజీ సీట్లను ముందస్తు  ప్రణాళిక ప్రకారం బ్లాక్  చేసి భారీ మొత్తానికి  విక్రయించారని  కాళోజీ  మెడికల్ యూనివర్శిటీ అధికారులు  2022 ఏప్రిల్  లో  వరంగల్ పోలీసులకు ఫిర్యాదు  చేశారు.  దీనిపై  పోలీసులు కేసు నమోదు  చేశారు.  ఈ కేసు ఆధారంగా  ఈడీ అధికారులు  రంగంలోకి దర్యాప్తు  నిర్వహిస్తున్నారు.  మెడికల్ కాలేజీ  సీట్ల స్కాంలో రూ. 100  కోట్లు చేతులు మారినట్టుగా  ప్రచారం సాగుతుంది.  

ఈ విషయమై  మంత్రి మల్లారెడ్డికి  చెందిన  కాలేజీ బాధ్యులకు  ఈడీ నోటీసులు ఇవ్వనుంది. ఈ కాలేజీతో పాటు పలు  కాలేజీలకు  ఈడీ అధికారులు  నోటీసులు  ఇవ్వనున్నారని ప్రముఖ తెలుగు న్యూస్ చానెల్ ఎన్టీవీ కథనం ప్రసారం చేసింది. 

PREV
click me!

Recommended Stories

కేవలం పది పాసైతే చాలు.. హైదరాబాద్ లోనే రూ.1,42,400 శాలరీతో సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్
Cold Wave Alert : ఈ మూడ్రోజులు తస్మాత్ జాగ్రత్త.. ఈ ప్రాంతాలకు పొంచివున్న చలిగండం..!