మంచిర్యాలలో భూప్రకంపనలు.. పరుగులు తీసిన జనం

Siva Kodati |  
Published : Oct 23, 2021, 03:12 PM IST
మంచిర్యాలలో భూప్రకంపనలు.. పరుగులు తీసిన జనం

సారాంశం

మంచిర్యాల జిల్లాలో (mancherial district) శనివారం భూ ప్రకంపనలు (earthquake) కలకలం సృష్టించాయి. జిల్లా కేంద్రంలో భూ ప్రకంపనలు సంభవించడంతో.. ప్రాణ భయంతో ఇళ్ల నుంచి రోడ్ల మీదకు పరుగులు తీశారు ప్రజలు

మంచిర్యాల జిల్లాలో (mancherial district) శనివారం భూ ప్రకంపనలు (earthquake) కలకలం సృష్టించాయి. జిల్లా కేంద్రంలో భూ ప్రకంపనలు సంభవించడంతో.. ప్రాణ భయంతో ఇళ్ల నుంచి రోడ్ల మీదకు పరుగులు తీశారు ప్రజలు. పట్టణంలోని చున్నంబట్టి వాడ, శ్రీశ్రీ నగర్, సీతారాంపల్లి, నస్పూర్, సీతారాంపూర్ తదితర ప్రాంతాల్లో రెండు సెకండ్ల పాటు భూమి కంపించిందని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. ఇంటిలోని సామాన్లు, వస్తువులు, కిటికీలు ఊగడంతో  భయాందోళనకు గురైన ప్రజలు ఇళ్ల నుంచి బయటకు పరుగులు పెట్టారు. ఇందుకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది. 

PREV
click me!

Recommended Stories

Bullet Train India: దూసుకొస్తున్న బుల్లెట్ ట్రైన్.. హైదరాబాద్, అమరావతి రూట్లలో గంటలో ప్రయాణం
MLC Kavitha: బబుల్ షూటర్ వల్లే కేసిఆర్ కి ట్రబుల్ హరీశ్ రావుపై కవిత సెటైర్లు | Asianet News Telugu