2024-25 ఆర్ధిక సంవత్సరానికి గాను తెలంగాణ బడ్జెట్ను రాష్ట్ర ఆర్ధిక మంత్రి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క గురువారం అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. శాసనమండలిలో మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు బడ్జెట్ను ప్రవేశపెట్టారు.
2024-25 ఆర్ధిక సంవత్సరానికి గాను తెలంగాణ బడ్జెట్ను రాష్ట్ర ఆర్ధిక మంత్రి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క గురువారం అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. రూ.2,75,891 కోట్లతో ఓటాన్ అకౌంట్ను భట్టి ప్రవేశపెట్టారు. ఇందులో రెవెన్యూ వ్యయం రూ.2,01,178 కోట్లు కాగా.. మూలధన వ్యయం రూ.29,669 కోట్లు . శాసనమండలిలో మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు బడ్జెట్ను ప్రవేశపెట్టారు.
డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క బడ్జెట్ ప్రసంగం :
తెలంగాణ సమాజం మార్పును కోరుకుంది
అందరం కోసం మనమందరం అనే స్పూర్తితో ముందుకెళ్తున్నాం
సమానత్వమే మా ప్రభుత్వ లక్ష్యం
మార్పును కోరుతూ తెలంగాణ ప్రజలు స్వేచ్ఛను సాధించుకున్నారు
తెలంగాణ ప్రజలకు మనస్పూర్తిగా కృతజ్ఞతలు
మాది ప్రజల ప్రభుత్వం
తెలంగాణలో ఇందిరమ్మ రాజ్యం తెస్తామని మాట ఇచ్చాం
గత ప్రభుత్వ పథకాలు గొప్ప.. అమలు దిబ్బ
గత ప్రభుత్వాల అప్పులు అభివృద్ధి అడ్డంకి కాదు
అప్పులను అధిగమించి అభివృద్ధిలో ముందడుగు వేస్తాం
గత పాలకుల నిర్వాకంతో ధనిక రాష్ట్రంలోనూ ఆర్ధిక కష్టాలు
సంతులిత వృద్ధి కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం
ఆర్భాటాలు, ఆకర్షణలకు దూరంగా ప్రభుత్వం
వర్షాభావం వల్ల పంట దిగుబడులు బాగా తగ్గాయి
ప్రజావాణి నిర్వహణకు ప్రత్యేక అధికారిగా సీనియర్ ఐఏఎస్ను నియమించాం
ప్రజావాణిలో 2 నెలల్లో వచ్చిన దరఖాస్తులు 43,054
ఇళ్ల కోసం వచ్చిన దరఖాస్తులు 14,951
భూ సమస్య కోసం వచ్చిన దరఖాస్తులు 8,927
పింఛన్ కోసం వచ్చిన దరఖాస్తులు 2,267
ఉద్యోగ కల్పన కోసం వచ్చిన దరఖాస్తులు 3,134
దరఖాస్తుల పరిష్కారం కోసం కలెక్టర్లు, శాఖాధిపతులకు పర్యవేక్షణ బాధ్యత
రుతుపవనాల ప్రభావం ఆర్ధిక వ్యవస్ధలో తీవ్రంగా వుంది
వ్యవసాయ రంగంలో క్షీణత ప్రజల ఆదాయంపై తీవ్ర ప్రభావం చూపింది
ఆహార పంటలు, వాణిజ్య పంటల్లో దిగుబడులు తగ్గాయి
ఆరు గ్యారంటీల అమలు ప్రభుత్వ తొలి ప్రాధాన్యత
ఆరు హామీల అమలులో లబ్ధిదారుల ఎంపిక వేగంగా సాగుతోంది
అర్హులైన అందరికీ ఆరు హామీలు అందుతాయి.
మహాలక్ష్మీ పథకం కోసం ఆర్టీసీకి ప్రభుత్వం నెలకు రూ.300 కోట్లు చెల్లిస్తోంది
ఆరోగ్యశ్రీకి అవసరమైన నిధులు ఏర్పాటు చేస్తున్నాం
గృహజ్యోతి ద్వారా అర్హులందరికీ 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్
త్వరలోనే రూ.500కే గ్యాస్ సిలిండర్ అందజేస్తాం
దావోస్ పర్యటన ద్వారా రాష్ట్రానికి రూ.40 వేల కోట్ల పెట్టుబడులు రానున్నాయి
పీఎం మిత్ర నిధులతో కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్ మరింత అభివృద్ధి
రెండు లెదర్ పార్కులు ఏర్పాటు చేస్తాం
రాష్ట్రం నలుమూలలా ఫార్మా క్లస్టర్లు ఏర్పాటు చేస్తాం
డ్రైపోర్టులను అందుబాటులోకి తెచ్చేందుకు బృహత్ ప్రణాళిక
గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి కృత్రిమ మేథ ఉపయోగిస్తాం
ఐటీ రంగంలో నైపుణ్యాభివృద్ధి కోసం నూతన పాలసీ
ఐటీని రాష్ట్ర నలుమూలలకు విస్తరించేందుకు ప్రణాళికలు
ఐటీ విస్తరణకు అమెరికాలోని ఐటీ సర్వ్ సంస్థతో సంప్రదింపులు
దేశంలోనే అత్యంత పటిష్టమైన ఫైబర్ నెట్వర్క్ కనెక్షన్లు వుండేలా రాష్ట్రాన్ని తీర్చిదిద్దుతాం
మిషన్ భగీరథ కోసం రూ.35,752 కోట్లు ఖర్చు చేసినట్లు గత ప్రభుత్వం చెప్పింది
వేల కోట్లు ఖర్చు చేసినా నేటికీ సురక్షిత నీరు లేని గ్రామాలెన్నో వున్నాయి
గత ప్రభుత్వ తప్పుడు నివేదికల వల్ల కేంద్రం నుంచి మనకు హక్కుగా రావాల్సిన నిధులు రాలేదు
గ్రామీణాభిృద్ధిలో పదేళ్లలో చోటు చేసుకున్న తప్పులను సరిదిద్దుతాం
మిషన్ భగీరథలో లోపాల దిద్దుబాటుకు చర్యలు తీసుకుంటాం
ఆర్ధిక వనరులు వృథా కాకుండా చర్యలు
గ్రామీణాభివృద్ధిలో పదేళ్లలో చోటు చేసుకున్న తప్పులను సరిదిద్దుతాం
స్థానిక సంస్థలకు హక్కులను తిరిగి అందిస్తాం
గ్రామ పంచాయతీలకు ఆర్ధిక వెసులుబాటు కల్పిస్తాం
గ్రామ పంచాయతీలను బలోపేతం చేస్తాం
గ్రామ పరిపాలనా వ్యవస్ధను తిరిగి ప్రజల చేతుల్లో పెడతాం
పాలనాపరంగా అన్ని సంస్థలు, వ్యవస్ధలను ప్రక్షాళన చేస్తాం
మూసీ పరివాహక ప్రాంతాన్ని ఉపాధి కల్పన జోన్గా మార్చేందుకు కార్యాచరణ
మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ ద్వారా మూసీ ప్రక్షాళన
హైదరాబాద్ కేంద్రంగా రాష్ట్రాన్ని మూడు జోన్లుగా అభివృద్ధి చేస్తాం
అర్బన్ జోన్గా ఔటర్ రింగ్ రోడ్ లోపల ప్రాంతం
పెరి అర్బన్ జోన్గా ఓఆర్ఆర్ - ఆర్ఆర్ఆర్ మధ్య ప్రాంతం
గ్రామీణ జోన్గా ఆర్ఆర్ఆర్ అవతలి ప్రాంతం
గత ప్రభుత్వ రైతుబంధుతో అనర్హులే ఎక్కువగా లాభం పొందారు
కొండలు, గుట్టలు, రోడ్లకు కూడా రైతుబంధు సాయమిచ్చారు
పెట్టుబడిదారులు, రియల్ ఎస్టేల్ సంస్థలకు రైతుబంధు ఇచ్చారు