ప్రియాంక నిందితులకు 14 రోజుల రిమాండ్, షాద్‌నగర్ పీఎస్ వద్ద ఉద్రిక్తత

Published : Nov 30, 2019, 03:29 PM ISTUpdated : Nov 30, 2019, 03:38 PM IST
ప్రియాంక నిందితులకు 14 రోజుల రిమాండ్, షాద్‌నగర్ పీఎస్ వద్ద ఉద్రిక్తత

సారాంశం

డాక్టర్ ప్రియాంక రెడ్డిపై అత్యాచారం చేసి, హతమార్చిన నలుగురు నిందితులను పోలీసులు మేజిస్ట్రేట్ పాండు నాయక్ ముందు హాజరుపరిచారు. 

డాక్టర్ ప్రియాంక రెడ్డిపై అత్యాచారం చేసి, హతమార్చిన నలుగురు నిందితులను పోలీసులు మేజిస్ట్రేట్ పాండు నాయక్ ముందు హాజరుపరిచారు. నిందితులను షాద్‌నగర్‌ పోలీస్ స్టేషన్‌కు తీసుకొస్తున్నట్లు తెలుసుకున్న స్థానికులు, ప్రజా సంఘాల కార్యకర్తలు భారీగా చేరుకోవడంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

మేజిస్ట్రేట్ రాకకుముందు నిందితులకు వైద్య పరీక్షలు నిర్వహించారు. నిందితులను కఠినంగా శిక్షించాలంటూ శనివారం ఉదయం నుంచి జనం ధర్నా చేస్తుండటంతో మేజిస్ట్రేట్ స్వయంగా షాద్‌నగర్ పోలీస్ స్టేషన్‌కు వచ్చారు. వీరికి మేజిస్ట్రేట్ 14 రోజుల రిమాండ్‌ను విధించారు. నలుగురు కామాంధులను శనివారం అర్ధరాత్రి దాటిన తర్వాత మహబూబ్‌నగర్ జిల్లా జైలుకు తరలించే అవకాశాలు కనిపిస్తున్నాయి. 

PREV
click me!

Recommended Stories

IMD Rain Alert : మళ్లీ వర్షాలు... ఈసారి ఫిబ్రవరిలో కంటే భారీగా, బిఅలర్ట్
Hyderabad Holi Celebrations 2026 at Tank Bund: హైదరాబాద్‌లో ఘనంగా హోలీ సంబరాలు| Asianet News Telugu