అంబేద్కర్ విగ్రహం ధ్వంసం...దళితుల ఆందోళన

sivanagaprasad kodati |  
Published : Jan 27, 2019, 12:50 PM IST
అంబేద్కర్ విగ్రహం ధ్వంసం...దళితుల ఆందోళన

సారాంశం

మేడ్చల్ జిల్లా కీసర మండలం రాంపల్లి గ్రామంలోని ప్రధాన కూడలి వద్ద ఉన్న రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డాక్టర్. బి.ఆర్. అంబేద్కర్ విగ్రహాన్ని గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. అంబేద్కర్ విగ్రహానికి ఉన్న తలను తొలగించి కిందపడేశారు. 

మేడ్చల్ జిల్లా కీసర మండలం రాంపల్లి గ్రామంలోని ప్రధాన కూడలి వద్ద ఉన్న రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డాక్టర్. బి.ఆర్. అంబేద్కర్ విగ్రహాన్ని గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. అంబేద్కర్ విగ్రహానికి ఉన్న తలను తొలగించి కిందపడేశారు.

ఈ విషయం తెలుసుకున్న గ్రామంలోని దళిత సంఘాల నేతలు ఘటనాస్థలికి చేరుకుని ఆందోళనకు దిగారు. ఘటనకు బాధ్యులను అదుపులోకి తీసుకునేవరకు ఆందోళన విరమించబోమని పట్టుబట్టారు. సమాచారం అందుకున్న పోలీసులు రాంపల్లికి చేరుకుని ఆందోళనకారులను శాంతింపజేశారు.
 

PREV
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : ఆదిలాబాద్ కంటే హైదరాబాద్ లోనే లోయెస్ట్ టెంపరేచర్స్ .. స్కూల్ టైమింగ్స్ చేంజ్
ముగిసిన పల్లె పోరు.. కాంగ్రెస్‌దే ఆధిపత్యం.. బీఆర్ఎస్ సంతృప్తి.. ఏయే పార్టీలు ఎన్ని స్థానాలు గెలిచాయంటే