తెలంగాణ సర్కారుపై డికె అరుణ ఆగ్రహం

Published : Dec 22, 2017, 01:52 PM ISTUpdated : Mar 25, 2018, 11:56 PM IST
తెలంగాణ సర్కారుపై డికె అరుణ ఆగ్రహం

సారాంశం

సంగాల చెర్వు ట్యాంక్ బండ్ పై సర్కారు వివక్ష నిధులున్నా పనులు మొదలు పెడతలేరు

సంగాల చేర్వు నీటిని రబీ సాగుకు విడుదల చేశారు ఎమ్మెల్యే డికె అరుణ. సంగాల చేర్వు కు నీటిని వదలడంతో స్థానిక రైతులు అనందం వ్యక్తం చేశారు.

సంగాల చేర్వు గద్వాల మండలానికి గ్రౌండ్ వాటర్ పెరగటానికి ఎంతో ఉపయోగం అవుతుందన్నారు డికె అరుణ. నెట్టంపాడు ప్రాజెక్ట్ తీసుకువచ్చింది కాంగ్రెస్ పార్టీ ఆ పనులను పూర్తి చేసింది కూడా కాంగ్రెస్ పార్టీనే అన్నారు.

సంగాల చేర్వు టూరిజం, ట్యాంక్ బండ్  ఏర్పాటుకు ఎమ్మెల్యేగా రెండేళ్ల క్రితం ప్రతిపాదనలు పంపినా.. ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు. అన్ని చోట్ల ట్యాంక్ బండ్ పనులకు టెండర్లు పిలిచి పనులను మొదలు పెట్టడం  జరిగిందన్నారు.

ఇక్కడ మాత్రం నిదులు వచ్చినప్పటికీ  రాజకీయ దురుద్దేశం తో  టెండర్లు పిలవడం లేదని ఆరోపించారు. ఇప్పటికైనా టెండర్లు పిలిచి పనులను పూర్తిచేయాలని డిమాండ్ చేశారు.

ఈ కార్యక్రమం లో పిసిసి కార్యవర్గ సభ్యుడు గడ్డం క్రిష్ణ రెడ్డి, విక్రమసింహారెడ్డి , అయ్యపు రెడ్డి, సర్పంచులు, ఎంపిటిసి తదతరులు ఉన్నారు.

PREV
click me!

Recommended Stories

Venkaiah Naidu: బండ్ల గణేష్ కుమార్తె నిశ్చితార్థం హాజరైన వెంకయ్య నాయుడు| Asianet News Telugu
KA Paul Pressmeet: తెలంగాణని నాశనం చేయడానికి కవిత కొత్త పార్టీ పెట్టింది: కేఏ పాల్| Asianet Telugu