ఢిల్లీ అమ్మాయిపై వారం పాటు హనుమకొండలో అత్యాచారం

Published : Jan 27, 2021, 07:02 AM ISTUpdated : Jan 27, 2021, 07:03 AM IST
ఢిల్లీ అమ్మాయిపై వారం పాటు హనుమకొండలో అత్యాచారం

సారాంశం

ఢిల్లీలోని బాలికను ఓ యువకుడు తెలంగాణలోని హనుమకొండకు రప్పించాడు. ఆమెపై అతను వారంపాటు అత్యాచారం చేశాడు. చివరకు పోలీసులు అతన్ని పట్టుకున్నారు.

వరంగల్: ఢిల్లీ అమ్మాయిపై ఓ యువకుడు తెలంగాణలోని హనుమకొండలో వారం రోజుల పాటు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఇన్ స్టాగ్రామ్ లో పరిచయమైన 16 ఏళ్ల బాలికను నూనె మురళీకృష్ణ హనుమకొండకు రప్పించాడు. రెండు నెలల క్రితం ఆమెను హనుమకొండకు పిలిపించాడు.

ఆ తర్వాత వారం రోజుల పాటు ఆమెపై అత్యాచారం చేశాడు. కూతురు కనిపించకపోవడంతో బాలిక తల్లిదండ్రులు ఢిల్లీలోని రాణిగంజ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. రాణిగంజ్ పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. 

బాలిక ఫోన్ కు హనుమకొండలోని మురళీకృష్ణకు తరుచుగా కాల్స్ వచ్చినట్లు పోలీసులు గుర్తించారు జీరో ఎఫ్ఐఆర్ కింద కేసును ఢిల్లీ పోలీసులు హనుమకొండకు మార్చారు. బాలిక తల్లిదండ్రులు ఈ నెల 14వ తేదీన హనుమకొండకు వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేశారు. 

దాంతో మురళీకృష్ణ  బాలికతో మురళీకృష్ణ పారిపోయాడు. తమిళనాడులోని ముదరైలో ఉండగా వారిద్దరిని పోలీసులు పట్టుకున్నారు. నిందితుడపై అత్యాచారం కేసు నమోదు చేసి అమ్మాయిని తల్లిదండ్రులకు అప్పగించారు. 

PREV
click me!

Recommended Stories

మీకు ఈ హెల్త్ ఇన్సూరెన్స్ ఉందా? మీకో బ్యాడ్ న్యూస్‌, క్యాష్‌లెస్ చికిత్స‌ల‌కు తాత్కాలిక్ బ్రేక్
కొత్త ఇంటికి కరెంట్ మీట‌ర్ ఎలా తీసుకోవాలి? అవసరమైన పత్రాలు, దరఖాస్తు విధానం పూర్తి వివరాలు