కరోనా ఎఫెక్ట్: డిగ్రీ, పీజీ సెమిస్టర్ పరీక్షలు వాయిదా

Published : Mar 24, 2021, 04:44 PM ISTUpdated : Mar 24, 2021, 04:52 PM IST
కరోనా ఎఫెక్ట్: డిగ్రీ, పీజీ సెమిస్టర్ పరీక్షలు వాయిదా

సారాంశం

తెలంగాణలో డిగ్రీ, పీజీ సెమిస్టర్ పరీక్షలను వాయిదా వేస్తున్నట్టుగా ఉన్నత విద్యామండలి ప్రకటించింది.త్వరలోనే రీ షెడ్యూల్ ను ప్రకటిస్తామని ఉన్నత విద్యామండలి తెలిపింది.  


హైదరాబాద్: తెలంగాణలో డిగ్రీ, పీజీ సెమిస్టర్ పరీక్షలను వాయిదా వేస్తున్నట్టుగా ఉన్నత విద్యామండలి ప్రకటించింది.త్వరలోనే రీ షెడ్యూల్ ను ప్రకటిస్తామని ఉన్నత విద్యామండలి తెలిపింది.

రాష్ట్రంలో కరోనా కేసులు పెరిగిపోతున్న నేపథ్యంలో ఈ నెల 24వ తేదీ నుండి విద్యా సంస్థలను రాష్ట్ర ప్రభుత్వం తాత్కాలికంగా మూసివేసింది.దీంతో డిగ్రీ, పీజీ సెమిస్టర్ పరీక్షలు వాయిదా వేశారు. విద్యా సంస్థల బంద్ తో పరీక్షలు వాయిదా వేసినట్టుగా ఉన్నత విద్యా మండలి ప్రకటించింది.

కరోనా నేపథ్యంలో గత ఏడాది కూడ ఆలస్యంగా పరీక్షలు పరిగాయి. దాని ప్రభావం ఈ ఏడాది పరీక్షలపై కూడ పడింది. ఈ ఏడాది సకాలంలో పరీక్షలు పూర్తి చేయాలని ప్రభుత్వం భావించింది. అయితే మరోసారి కరోనా కేసులు పెరిగిపోతున్న నేపథ్యంలో విద్యా సంస్థలను తాత్కాలికంగా మూసివేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకొంది.

రాష్ట్రంలో కరోనా కేసుల వ్యాప్తిని అదుపు చేసేందుకు చర్యలు తీసుకొంటూనే మరోవైపు వ్యాక్నిసేషన్ ను మరింత వేగవంతం  చేసింది ప్రభుత్వం.

PREV
click me!

Recommended Stories

ప్రజా ఆశీర్వాద సభలో కేసీఆర్ పవర్ ఫుల్ స్పీచ్ | KCR Powerful Speech at Praja Ashirvada Sabha
KCR: నా కొడకా.. నా చావు కోరుకుంటావా? వెయ్యి జన్మలెత్తినా నన్ను ఏమీ చేయలేరు ! కేసీఆర్ మాస్ కౌంటర్