టీఎస్‌పీఎస్సీ పేపర్ లీక్ : కోర్టులో ట్రయల్స్ ప్రారంభం.. హాజరైన 37 మంది నిందితులు

Siva Kodati |  
Published : Sep 15, 2023, 08:49 PM IST
టీఎస్‌పీఎస్సీ పేపర్ లీక్ : కోర్టులో ట్రయల్స్ ప్రారంభం.. హాజరైన 37 మంది నిందితులు

సారాంశం

టీఎస్‌పీఎస్సీ ప్రశ్నాపత్రాల లీకేజ్ కేసులో కోర్టులో ట్రయల్స్ ప్రారంభమయ్యాయి. ఈ విచారణకు 37 మంది నిందితులు హాజరయ్యారు. ప్రధాన నిందితులు ప్రవీణ్, రాజశేఖర్ రెడ్డ, రేణుక, రాజేశ్వర్‌తో పాటు మిగిలిన నిందితులు హాజరయ్యారు.

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన టీఎస్‌పీఎస్సీ ప్రశ్నాపత్రాల లీకేజ్ కేసులో కోర్టులో ట్రయల్స్ ప్రారంభమయ్యాయి. ఈ విచారణకు 37 మంది నిందితులు హాజరయ్యారు. ప్రధాన నిందితులు ప్రవీణ్, రాజశేఖర్ రెడ్డ, రేణుక, రాజేశ్వర్‌తో పాటు మిగిలిన నిందితులు హాజరయ్యారు. ఈ కేసుకు సంబంధించి గత నెలలో ప్రాథమిక చార్జ్‌షీట్ దాఖలు చేశారు సిట్ అధికారులు. ప్రాథమిక ఛార్జ్‌షీట్‌లో 37 మందిని నిందితులుగా చేర్చారు. ఈ ప్రశ్నాపత్రాల లీకేజ్ కేసులో ఇప్పటి వరకు 105 మందిని సిట్ అరెస్ట్ చేసింది. త్వరలో మిగతా నిందితులతో అనుబంధ ఛార్జ్‌షీట్ దాఖలు చేయనున్నారు సిట్ అధికారులు. ప్రధాన నిందితుడు ప్రవీణ్ మినహా మిగిలిన అందరికీ ఇప్పటికే బెయిల్ మంజూరు చేసింది కోర్ట్. 

PREV
click me!

Recommended Stories

Today Gold Rate:పసిడి ప్రియులకు Good News.. తగ్గిన బంగారం ధరలు! | 13April2026 | Asianet News Telugu
Summer Heat : ఏంటిది సూరీడూ.. తెలుగు నేలపై 43.8 డిగ్రీల ఉష్ణోగ్రతలా..! ఆలిండియా రికార్డులు బద్దలవుతాయా..?