షబ్బీర్‌ అలీపై దాడి కేసు: ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ పై నాన్ బెయిలబుల్ వారంట్ జారీ

Published : Jan 25, 2021, 02:11 PM IST
షబ్బీర్‌ అలీపై దాడి కేసు: ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ పై నాన్ బెయిలబుల్ వారంట్ జారీ

సారాంశం

ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీపై  కోర్టు సోమవారం నాడు నాన్ బెయిలబుల్ వారంట్ జారీ చేసింది.

హైదరాబాద్: ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీపై  కోర్టు సోమవారం నాడు నాన్ బెయిలబుల్ వారంట్ జారీ చేసింది.2016లో టీపీసీసీ చీప్ ఉత్తమ్ కుమార్, ఆ పార్టీ నేత షబ్బీర్ అలీలు ప్రయాణీస్తున్న కారును కొందరు వ్యక్తులు అడ్డుకొన్నారు. కారులో ప్రయాణీస్తున్న మాజీ మంత్రి షబ్బీర్ అలీపై దాడి చేశారు. ఈ విషయమై అప్పట్లో కాంగ్రెస్ నేతలు మీర్ చౌక్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.

ఈ కారుపై ఎంఐఎం నేతలు దాడికి దిగారని అప్పట్లో కాంగ్రెస్ నేతలు ఫిర్యాదు చేశారు. ఈ కేసులో హైద్రాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ ప్రధాన నిందితుడిగా ఉన్నాడు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు అసద్ పై క్రిమినల్ కేసు నమోదు చేశారు. 

అయితే ఈ దాడిలో తన పాత్ర లేదని గతంలోనే ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ స్పష్టత ఇచ్చారు. ఈ మేరకు ట్విట్టర్ వేదికగా ఆయన ఈ విషయాన్ని ప్రకటించారు.  దాడికి పాల్పడుతున్నవారిని తాను అడ్డుకొన్నట్టుగా ఆయన పేర్కొన్నారు.
 

PREV
click me!

Recommended Stories

ముగిసిన పల్లె పోరు.. కాంగ్రెస్‌దే ఆధిపత్యం.. బీఆర్ఎస్ సంతృప్తి.. ఏయే పార్టీలు ఎన్ని స్థానాలు గెలిచాయంటే
100 ఏళ్లైన చెక్కుచెద‌ర‌ని, అతిపెద్ద ప్రార్థ‌న మందిరం.. హైద‌రాబాద్‌కు ద‌గ్గ‌రలో అద్భుత నిర్మాణం