కౌన్సిలర్‌ శ్రీనుపై కత్తులతో దాడి, తీవ్ర గాయాలు

Published : Apr 17, 2019, 12:50 PM ISTUpdated : Apr 17, 2019, 12:53 PM IST
కౌన్సిలర్‌ శ్రీనుపై కత్తులతో దాడి, తీవ్ర గాయాలు

సారాంశం

 జగిత్యాల పట్టణానికి చెందిన 15వ వార్డు కౌన్సిలర్ శ్రీనుపై కొంతమంది హత్యాయత్నానికి పాల్పడ్డారు. ఇంట్లో నిద్రిస్తున్న శ్రీనుపై కత్తులతో విచక్షణరహితంగా దాడి చేశారు.  

జగిత్యాల: జగిత్యాల పట్టణానికి చెందిన 15వ వార్డు కౌన్సిలర్ శ్రీనుపై కొంతమంది హత్యాయత్నానికి పాల్పడ్డారు. ఇంట్లో నిద్రిస్తున్న శ్రీనుపై కత్తులతో విచక్షణరహితంగా దాడి చేశారు.

ఈ సమాచారం అందుకొన్న పోలీసులు ఘటనస్థలికి చేరుకొని బాధితుడ్ని ఆసుపత్రికి తరలించారు. కత్తి దాడితో కౌన్సిలర్ తీవ్రంగా గాయపడ్డాడు. అతను అపస్మారకస్థితిలోకి వెళ్లిపోయారు. ప్రస్తుతం ఆయన ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. పాత కక్షల నేపథ్యంలోనే ఈ దాడి జరిగినట్టుగా తెలుస్తోంది.

తెలిసినవారే ఈ దాడికి పాల్పడినట్టుగా పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. నిందితుల కోసం గాలింపు చేస్తున్నారు.

PREV
click me!

Recommended Stories

Government Jobs : గట్టిగా ట్రై చేస్తే నెలకు రూ.1,27,050 జీతంతో ఓ సర్కార్ నౌకరీ మీదే.. టిజిపిఎస్సి జాబ్ నోటిఫికేషన్ ఫుల్ డిటెయిల్స్
Flash Floods Alert : తెలుగు రాష్ట్రాల్లో గోదావరి ఉగ్రరూపం.. పోటెత్తిన వరదనీరు, ఈ ప్రాంతాల్లో ప్లాష్ ప్లడ్స్ తప్పవా?