నిర్మల్ లో కొత్తగా రెండు కరోనా కేసులు: తెలంగాణలో పెరిగిన సంఖ్య

By telugu teamFirst Published Apr 11, 2020, 10:23 AM IST
Highlights

తెలంగాణలోని నిర్మల్ లో మరో రెండు కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో నిర్మల్ జిల్లాలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 17కు చేరుకుంది వీరిద్దరు కూడా మర్కజ్ వెళ్లివచ్చినవారే.

నిర్మల్: తెలంగాణలోని నిర్మల్ జిల్లాలో కొత్త రెండు కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో నిర్మల్ జిల్లాలో కోవిడ్ -19 కేసుల సంఖ్య 17కు చేరుకుంది. దీంతో తెలంగాణలో కరోనా వైరస్ కేసుల సంఖ్య 489కి చేరుకుంది.

తెలంగాణలో శుక్రవారం కొత్తగా 16 కేసులు నమోదైన విషయం తెలిసిందే. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 487కు చేరుకుంది. తెలంగాణలో యాక్టివ్ కేసులు 430 ఉన్నాయి. ఇప్పటి వరకు కోలుకుని 48 మంది డిశ్చార్జీ అయ్యారు. 

తెలంగాణ రాష్ట్రంలో గురువారం 18 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 471కి చేరుకుంది. ఇందులో 414 యాక్టివ్ కేసులు. మంత్రి ఈటెల రాజేందర్ గురువారం వెల్లడించిన వివరాలు ఈ విధంగా ఉన్నాయి... ఈ రోజు కరోనా వ్యాధితో ఓ వ్యక్తి మరణించాడు. దీంతో కరోనా వ్యాధితో సంభవించిన మరణాల సంఖ్య 12కు చేరుకుంది. 

కరోనా వైరస్ వ్యాధితో ఆస్పత్రుల్లో చేరినవారిలో 45 మంది డిశ్చార్జీ అయినట్లు ఆయన తెలిపారు.  ఈ రోజు 665 మందికి పరీక్షలు నిర్వహించగా 18 మందికి కరోనా పాజిటివ్ ఉందని తేలిందని ఆయన చెప్పారు. లాక్ డౌన్ వల్ల కేసుల సంఖ్య తగ్గిందని ఆయన చెప్పారు. లేదంటే చాలా ప్రమాదం జరిగి ఉండేదని ఆయన అన్నారు.  

పాజిటివ్ కేసులు వచ్చిన ప్రాంతాల్లో ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రి తెలిపారు. ఈ నెల 22వ తేదీనాటికి చికిత్స పొందుతున్నవారంతా డిశ్చార్జీ అవుతారని ఆయన చెప్పారు. లక్షణాలుంటే కింగ్ కోఠీ ఆస్పత్రిలో పరీక్షలు చేయించుకోవాలని, గాంధీ ఆస్పత్రి కరోనా వైరస్ రోగులకు మాత్రమే చికిత్స అందిస్తుందని ఆయన అన్నారు. హాట్ స్పాట్ గా ప్రకటించిన ప్రాంతాల్లో రాకపోకలు బంద్ అవుతాయని ఆయన చెప్పారు. తెలంగాణలో 101 హాట్ స్పాట్స్ ఉన్నాయని ఆయన చెప్పారు. 

కేసులు తగ్గుతున్నాయని లైట్ గా తీసుకోవద్దని ఆయన సూచించారు లాక్ డౌన్ నియమాలను ప్రజలు పాటించాలని ఆయన సూచించారు. హాట్ స్పాట్ ప్రాంతాలను అధికారులు దిగ్బంధం చేస్తారని ఆయన చెప్పారు. కూరగాయలు, నిత్యావసర సరుకులు కూడా అక్కడికే అందిస్తారని, బయటకు అసలు వెళ్లడానికి ఉండదని ఆయన చెప్పారు. 

click me!