తెలంగాణలో విజృంభిస్తున్న కరోనా: 75 వేలు దాటిన పాజిటివ్ కేసులు

By telugu teamFirst Published Aug 7, 2020, 9:08 AM IST
Highlights

తెలంగాణలో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. తాజాగా కోవిడ్ -19 కేసుల సంఖ్య తెలంగాణలో 75 వేల మార్కును దాటింది. హైదరాబాదులో ఎప్పటిలాగే 500కు పైగా కేసులు రికార్డయ్యాయి.

హైదరాబాద్: తెలంగాణలో కరోనా వైరస్ విజృంభిస్తూనే ఉంది. తాజాగా గత 24 గంటల్లో తెలంగాణలో 2207 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కోవిడ్-19 పాజిటివ్ కేసుల సంఖ్య 75,257కు చేరుకుంది. తాజాగా గత 24 గంటల్లో కరోనా వైరస్ తో 12 మంది మృత్యువాత పడ్డారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 601కి చేరుకుంది. 

హైదరాబాదు, రంగారెడ్డి, మేడ్చెల్ మల్కాజిగిరి, వరంగల్ అర్బన్ జిల్లాల్లో కరోనా వైరస్ విజృంభణ ఎప్పటిలాగే ఉంది. గత 24 గంటల్లో జీహెచ్ఎంసీ పరిధిలో 532 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదు కాగా, మేడ్చెల్ మల్కాజిగిరి జిల్లాలో 136 కేసులు రికార్డయ్యాయి. అలాగే రంగారెడ్డి జిల్లాలో 196 కేసులు, వరంగల్ అర్బన్ జిల్లాలో 142 కేసులు నమోదయ్యాయి. 

గత 24 గంటల్లో ఆదిలాబాద్ జిల్లాలో 14, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 82, జగిత్యాల జిల్లాలో 36, జనగామ జిల్లాలో 60, జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో 29, జోగులాంబ గద్వాల జిల్లాలో 87, కామారెడ్డి జిల్లాలో 96, కరీంనగర్ జిల్లాలో 93, ఖమ్మం జిల్లాలో 85 కేసులు నమోదయ్యాయి.

కొమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లాలో 21, మహబూబ్ నగర్ జిల్లాలో 51, మహబూబాబాద్ జిల్ాలలో 21, మంచిర్యాల జిల్లాలో 35, మెదక్ జిల్లాలో 32, ములుగు జిల్లాలో 20, నాగర్ కర్నూలు జిల్లాలో 36, నల్లగొండ జిల్లాలో 28, నారాయణపేట జిల్లాలో 15, నిర్మల్ జిల్లాలో 6, నిజామాబాద్ జిల్లాలో 89, పెద్దపల్లి జిల్లాలో 71 కేసులు నమోద్యయాయి.

రాజన్న సిరిసిల్ల జిల్లాలో 25, సంగారెడ్డి జిల్లాలో 37, సిద్దిపేట జిల్లాలో 28, సూర్యాపేట జిల్లాలో 23, వికారాబాద్ జిల్లాలో 24, వనపర్తి జిల్లాలో 18, వరంగల్ రూరల్ జిల్లాలో 16, యాదాద్రి భువనగరి జిల్లాలో 23 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.

 

Media Bulletin on status of positive cases in Telangana. (Dated. 07.08.2020) pic.twitter.com/FbU2jSc9fe

— Dr G Srinivasa Rao (@drgsrao)
click me!