తెలంగాణలో కరోనా విజృంభణ: ఒక్క రోజులో వేయి దాటిన పాజిటివ్ కేసులు

Published : Aug 16, 2020, 09:13 AM IST
తెలంగాణలో కరోనా విజృంభణ: ఒక్క రోజులో వేయి దాటిన పాజిటివ్ కేసులు

సారాంశం

తెలంగాణలో కరోనా వైరస్ విజృంభిస్తూనే ఉంది. తెలంగాణలో 91 వేలకు పైగా కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. హైదరాబాదుకు కాస్తా ఊరట లభించినట్లు అర్థమవుతోంది.

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో కోరనా వైరస్ ఉధృతి కొనసాగుతూనే ఉంది. తాజాగా గత 24 గంటల్లో వేయికి పైగా కోవిడ్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కొత్తగా ఒక్క రోజులో 1102 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు రికార్డయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 91361కి చేరుకుంది. 

గత 24 గంటల్లో తెలంగాణలో కరోనా వైరస్ తో 9 మంది మృత్యువాత పడ్డారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 693కు చేరుకుంది. కాగా, రాష్ట్రంలో యాక్టివ్ కేసుల సంఖ్య 22,542 ఉంది. ఇ్పపటి వరకు 68,126 మంది కరోనా నుంచి కోలుకుని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. 


తెలంగాణలో జిల్లాలవారీగా గత 24 గంటల్లో నమోదైన కేసుల సంఖ్య

ఆదిలాబాద్  14
భద్రాద్రి కొత్తగూడెం 15 
జిహెచ్ఎంసీ 234
జగిత్యాల  11
జనగామ16
జయశంకర్ భూపాలపల్లి 0
జోగులాంబ గద్వాల  17
కామారెడ్డి 33
కరీంనగర్ 101
ఖమ్మం  46
కొమరం భీమ్ ఆసిఫాబాద్ 3
మహబూబ్ నగర్ 37
మహబూబాబాద్ 21
మంచిర్యాల  9
మెదక్ 63
మేడ్చెల్ మల్కాజిగిరి 63
ములుగు 8
నాగర్ కర్నూలు 29
నల్లగొండ 28
నారాయణపేట 4
నిర్మల్ 4
నిజామాబాద్ 33
పెద్దపల్లి 22
రాజన్న సిరిసిల్ల 13 
రంగారెడ్డి 81
సంగారెడ్డి 66
సిద్ధిపేట 30 
సూర్యాపేట 13
వికారాబాద్ 8
వనపర్తి 19
వరంగల్ రూరల్ 25
వరంగల్ అర్బన్ 70
యదాద్రి భువనగిరి 11
మొత్తం కేసులు 1102

 

PREV
click me!

Recommended Stories

Panchayat Elections : తెలంగాణ పంచాయతీ ఎన్నికలు.. మూడో దశలోనూ కాంగ్రెస్ హవా
IMD Cold Wave Alert : మరోసారి కుప్పకూలనున్న టెంపరేచర్స్.. ఈ నాల్రోజులు చుక్కలే