గజ్వేల్ లో ఓటమి భయంతోనే కామారెడ్డిలో పోటీ.. : కేసీఆర్ పై మహ్మద్ అలీ షబ్బీర్ ఫైర్

Published : Aug 21, 2023, 11:29 PM IST
గజ్వేల్ లో ఓటమి భయంతోనే కామారెడ్డిలో పోటీ.. : కేసీఆర్ పై  మహ్మద్ అలీ షబ్బీర్ ఫైర్

సారాంశం

Hyderabad: ఈ ఏడాది చివ‌ర్లో జ‌రిగే తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌ల బ‌రిలో నిలిచే బీఆర్ఎస్ అభ్య‌ర్థులు జాబితాను ఆ పార్టీ అధినేత, రాష్ట్ర ముఖ్య‌మంత్రి కే.చంద్ర‌శేఖ‌ర్ రావు (కేసీఆర్) ప్ర‌క‌టించారు. ఈక్ర‌మంలోనే ఆయ‌న గ‌జ్వేల్ తో పాటు కామారెడ్డి నుంచి పోటీ చేయ‌నున్న‌ట్టు ప్ర‌క‌టించారు. దీనిపై స్పందించిన కాంగ్రెస్ సీనియ‌ర్ నాయ‌కులు, మాజీ మంత్రి మహ్మద్ అలీ షబ్బీర్.. గ‌జ్వేల్ ఓట‌మి భ‌యంతోనే కేసీఆర్ కామారెడ్డిలో పోటీ చేస్తున్నార‌ని అన్నారు.  

Senior Congress leader Mohammed Ali Shabbir: ఈ ఏడాది చివ‌ర్లో జ‌రిగే తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌ల బ‌రిలో నిలిచే బీఆర్ఎస్ అభ్య‌ర్థులు జాబితాను ఆ పార్టీ అధినేత, రాష్ట్ర ముఖ్య‌మంత్రి కే.చంద్ర‌శేఖ‌ర్ రావు (కేసీఆర్) ప్ర‌క‌టించారు. ఈక్ర‌మంలోనే ఆయ‌న గ‌జ్వేల్ తో పాటు కామారెడ్డి నుంచి పోటీ చేయ‌నున్న‌ట్టు ప్ర‌క‌టించారు. దీనిపై స్పందించిన కాంగ్రెస్ సీనియ‌ర్ నాయ‌కులు, మాజీ మంత్రి మహ్మద్ అలీ షబ్బీర్.. గ‌జ్వేల్ ఓట‌మి భ‌యంతోనే కేసీఆర్ కామారెడ్డిలో పోటీ చేస్తున్నార‌ని అన్నారు. అయితే, కామారెడ్డిలో కూడా కేసీఆర్ ఓట‌మి త‌ప్ప‌ద‌నీ, కాంగ్రెస్ భారీ మెజారిటీతో ఈ స్థానం గెలుచుకుంటుంద‌ని ధీమా వ్యక్తంచేశారు.

వివ‌రాల్లోకెళ్తే.. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కామారెడ్డి నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని సీఎం కేసీఆర్ నిర్ణయించడం ఆయ‌న‌ రాజకీయంగా ఘోర పరాభవానికి దారితీస్తుందని కాంగ్రెస్ సీనియర్ నేత మహ్మద్ అలీ షబ్బీర్ అన్నారు. గాంధీభవన్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో షబ్బీర్ అలీ మాట్లాడుతూ.. ''నేను కామారెడ్డిలోనే పుట్టి పెరిగాను. కామారెడ్డి నియోజకవర్గంలో గెలుపు ఓటములు అనుభవించి ప్రజలతో మమేకమయ్యాను. కామారెడ్డి నా ఇల్లు మాత్రమే కాదు. అది నా హృదయం నా ఆత్మ. గజ్వేల్ లో ఓటమి భయం కేసీఆర్ ను కామారెడ్డి వైపు నడిపించింది. ఏదేమైనా, ఆయ‌న తన కెరీర్ లో అత్యంత ముఖ్యమైన ఓటమిని ఎదుర్కొంటార‌ని'' పేర్కొన్నారు.

సీఎం కేసీఆర్ తొమ్మిదేళ్ల పాలనలో కామారెడ్డిలో ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టలేదని షబ్బీర్ అలీ విమర్శించారు. ప్రస్తుత ఎమ్మెల్యే గంప గోవర్ధన్ పనితీరు ప్రజలను నిరాశకు గురిచేసిందనీ, వచ్చే ఎన్నికల్లో ఆయనకు ఓటు వేయ‌వ‌ద్ద‌ని ఇప్పటికే నిర్ణయించుకున్నారని చెప్పారు. అయితే, కామారెడ్డి నుంచి పోటీ చేయాలని కేసీఆర్ నిర్ణయించడం ప్రజల సెంటిమెంట్ ను దెబ్బతీసే ప్రయత్నమని ఆయన అన్నారు. గంప గోవర్ధన్ కు పట్టిన గతే కేసీఆర్ కు పడుతుందనీ, వచ్చే ఎన్నికల్లో ఓడిపోవడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.

గజ్వేల్, కామారెడ్డి రెండింటి నుంచి పోటీ చేయాలని కేసీఆర్ నిర్ణయించడం చూస్తుంటే గంప గోవర్ధన్ వచ్చే ఎన్నికల్లో తనను ఓడించలేడని ఆయనకు తెలుసన్నారు. తనపై పోటీ చేయడం ద్వారా కేసీఆర్ కామారెడ్డి పుత్రుడిని టార్గెట్ చేయడమే కాకుండా ముస్లిం నాయకత్వంపై తనకున్న ద్వేషాన్ని చాటుకున్నారని అన్నారు. రాబోయే తెలంగాణ ఎన్నికల్లో తన ప్రస్తుత నియోజకవర్గం గజ్వేల్, కామారెడ్డితో సహా రెండు నియోజకవర్గాల నుంచి పోటీ చేస్తానని బీఆర్ఎస్ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించిన సంగ‌తి తెలిసిందే.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

దుమ్ములేపే స్పీచ్ CM Revath Reddy Next Level Speech At Teachers Day Meeting | Asianet Telugu
Rapido: ర్యాపిడో ఉప‌యోగించే మ‌హిళ‌ల‌కు పండ‌గ‌లాంటి వార్త‌.. అందుబాటులోకి కొత్త స‌ర్వీస్‌