ఓ పోలీస్ కానిస్టేబుల్ లాడ్జిలో ఓ యువతితో రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయాడు. వివరాల్లోకి వెళితే.. కడెం మండలానికి చెందిన ఓ యువతి ఆదివారం రాత్రి నిర్మల్ బస్టాండ్లో సీపీఎస్ కానిస్టేబుల్కు కనిపించింది
ఓ పోలీస్ కానిస్టేబుల్ లాడ్జిలో ఓ యువతితో రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయాడు. వివరాల్లోకి వెళితే.. కడెం మండలానికి చెందిన ఓ యువతి ఆదివారం రాత్రి నిర్మల్ బస్టాండ్లో సీపీఎస్ కానిస్టేబుల్కు కనిపించింది.
వెంటనే కానిస్టేబుల్ ఆ యువతిని బస్టాండ్ సమీపంలోని ఓ లాడ్జికి తీసుకెళ్లాడు. దీంతో ఈ విషయాన్ని స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. రంగంలోకి దిగిన పోలీసులు కానిస్టేబుల్తో పాటు యువతిని అదుపులోకి తీసుకున్నారు.
అయితే నిర్మల్లో బియ్యాన్ని అక్రమంగా తరలిస్తున్న వ్యాపారులు కావాలనే కుట్రపన్ని కానిస్టేబుల్ను ఇందులో ఇరికించారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. హైదరాబాద్ నుంచి వచ్చిన ఆ యువతి కడెం వెళ్లేందుకు బస్టాండ్లో వేచి చూస్తుండగా.. బస్సు సమయం మించిపోయింది.
ఆ సమయంలో ఆమెను గమనించిన ఇద్దరు వ్యక్తులు ఆ యువతిని వేధిస్తున్నట్లు సీసీఎస్ పోలీసుల దృష్టికి వచ్చింది. దీంతో ఎబ్నైజర్ కానిస్టేబుల్ బస్టాండ్కు వెళ్లి ఆ యువతిని లాడ్జిలో ఉంచేందుకు యజమానితో మాట్లాడి బయటకు వెళ్లాడు.
తిరిగి ఆ యువతి ఫోన్ చేయడంతో అతను వాటర్ బాటిల్ తీసుకుని లాడ్జిలోకి వెళ్లగా.. స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. వీరిని పోలీస్ స్టేషన్కు తీసుకెళ్లామని.. నేరం రుజువైతే శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పీ శశిధర్ రాజు తెలిపారు.