కొడంగల్‌లో రిటర్నింగ్ అధికారి పక్షపాతం: కాంగ్రెస్ ధర్నా

Published : Dec 07, 2018, 03:20 PM IST
కొడంగల్‌లో రిటర్నింగ్ అధికారి పక్షపాతం: కాంగ్రెస్ ధర్నా

సారాంశం

ఎన్నికల రిటర్నింగ్ అధికారి ఓ రాజకీయ పార్టీకి ఓటేయాలని చెబుతున్నారని  కొడంగల్ జూనియర్ కాలేజీ పోలింగ్ స్టేషన్‌ వద్ద  కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు  శుక్రవారం నాడు  ధర్నాకు దిగారు. 


కొడంగల్:  ఎన్నికల రిటర్నింగ్ అధికారి ఓ రాజకీయ పార్టీకి ఓటేయాలని చెబుతున్నారని  కొడంగల్ జూనియర్ కాలేజీ పోలింగ్ స్టేషన్‌ వద్ద  కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు  శుక్రవారం నాడు  ధర్నాకు దిగారు. 

కొడంగల్ ప్రభుత్వ కాలేజీ పోలింగ్ స్టేషన్‌ పరిధిలో ఓటర్లను  ప్రభావితం చేస్తున్నారని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. ఈవీఎంలోని ఓ నెంబర్ గుర్తుకే ఓటేయాలని  రిటర్నింగ్ అధికారి ప్రచారం చేస్తున్నారని  ఆరోపిస్తూ  కాంగ్రెస్ కార్యకర్తలు ఆందోళన చేశారు.

ఈ ఆందోళన విషయం తెలుసుకొన్న ఎస్పీ అవినాష్ మహంతి   పోలింగ్ స్టేషన్‌ను వద్దకు చేరుకొని పరిస్థితిని  పరిశీలించారు. కొడంగల్  అసెంబ్లీ నియోజకవర్గంలో ఉదయం నుండి  ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. 


సంబంధిత వార్తలు

కొడంగల్‌లో టీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య ఘర్షణ, ఉద్రిక్తత

PREV
click me!

Recommended Stories

Hyderabad: ఇక ఊపిరి పీల్చుకోండి.. రూ. 700 కోట్ల‌తో భారీ ఫ్లై ఓవ‌ర్‌. ఈ ప్రాంతంలో ఊహించ‌ని మార్పు
Indian Air Force Jobs : కేవలం తెలుగు యువతకు మాత్రమే.. ఇంటర్ అర్హతతోనే భారత వాయుసేనలో ఉద్యోగావకాశాలు