హైద్రాబాద్ బోయినపల్లిలో కాంగ్రెస్ శిక్షణ తరగతులు: గైర్హాజరైన సీనియర్లు

Published : Jan 04, 2023, 02:12 PM ISTUpdated : Jan 04, 2023, 02:28 PM IST
హైద్రాబాద్ బోయినపల్లిలో  కాంగ్రెస్ శిక్షణ తరగతులు: గైర్హాజరైన సీనియర్లు

సారాంశం

నగరంలోని బోయినపల్లిలో  తెలంగాణ కాంగ్రెస్ పార్టీ శిక్షణ తరగతులు ఇవాళ ప్రారంభమయ్యాయి.  ఈ శిక్షణ తరగతులకు  సీనియర్లు  గైర్హాజరయ్యారు.పలు కారణాలతో  సీనియర్లు కొందరు  ఈ ట్రైనింగ్ సెషన్ కు దూరంగా  ఉన్నారు. 

హైదరాబాద్:  నగరంలోని బోయినపల్లిలో  తెలంగాణ కాంగ్రెస్ పార్టీ శిక్షణ తరగతులు ఇవాళ ప్రారంభమయ్యాయి.ఈ శిక్షణ తరగతులకు  సీనియర్లు గైర్హాజరయ్యారు. ధరణి, హత్ సే హత్  జోడో , ఎన్నికల నిబంధనలపై  నేతలకు  శిక్షణ ఇవ్వనున్నారు.  ఈ కార్యక్రమానికి  హత్ సే హత్  జోడో  అభియాన్ తెలంగాణ ఇంచార్జీ  గిరీష్ జోడంకర్  హాజరయ్యారు. 

ఈ శిక్షణ తరగతులకు హాజరు కావాలని  కాంగ్రెస్ సీనియర్లకు  ఎఐసీసీ చీఫ్ మల్లికార్జుణ ఖర్గే సూచించారు.  టీపీసీసీ మాజీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి  నిన్న ఖర్గే ఫోన్ చేశారు.  శిక్షణ తరగతులకు హాజరు కావాలని సూచించారు. అయితే కొందరు సీనియర్లు ఈ సమావేశానికి గైర్హాజరయ్యారు.  పార్టీ సమావేశాలతో పాటు  ఇతరత్రా కారణాలతో  సీనియర్లు  ఈ సమావేశానికి దూరంగా  ఉన్నారు. 

డిఫెన్స్  పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ సమావేశంలో  పాల్గొనేందుకు ఉత్తమ్ కుమార్ రెడ్డి  ఢిల్లీకి వెళ్లారు. దీంతో ఆయన ఈ సమావేశానికి దూరంగా  ఉన్నారు.  మాజీ డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహ  శ్రీశైలంలో  ఉండడంతో ఆయన  కూడా  ఈ కార్యక్రమానికి హాజరు కాలేదు.  ఎఐసీసీ ఇచ్చిన  కార్యక్రమాల్లో భాగంగా మాజీ మంత్రి శ్రీధర్ బాబు మహరాష్ట్ర పర్యటనలో  ఉన్నారు. దీంతో  శిక్షణ తరగతులకు  దూరమయ్యారు.  ములుగు ఎమ్మెల్యే సీతక్క  భారత్ జోడో యాత్రలో  ఉన్నందున ఆమె కూడా ఈ శిక్షణ తరగతులకు  దూరంగా  ఉన్నారు.ఎఐసీసీ  కార్యక్రమంలో భాగంగా  వేరే రాష్ట్రంలో  ఉన్నందున  వి. హనుమంతరావు  కూడా ఈ  శిక్షణ తరగతులకు రాలేదు. 

ఈ సమావేశానికి ఎఐసీసీ సెక్రటరీ బోస్ రాజు ,సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క, మాజీ మంత్రులు కోదండ రెడ్డి , షబ్బీర్ అలీ  తదితరులు ఈ సమావేశానికి హాజరయ్యారు .రాష్ట్ర కాంగ్రెస్ లో  చోటు చేసుకున్న పరిణామాల నేపథ్యంలో  దిగ్విజయ్ సింగ్  గత మాసంలో  రాష్ట్రంలో పర్యటించారు. కాంగ్రెస్ నేతలతో చర్చించారు.  ఏదైనా ఇబ్బందులుంటే  పార్టీ అంతర్గత వేదికల్లోనే చర్చించాలని  దిగ్విజయ్ సింగ్  సూచించారు.
 

PREV
click me!

Recommended Stories

శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో కలకలం... ఇంటర్నేషనల్ విమానాలకు బాంబు బెదిరింపులు
కేవలం పది పాసైతే చాలు.. హైదరాబాద్ లోనే రూ.1,42,400 శాలరీతో సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్