ఓటమిపై పోస్ట్‌మార్టమ్: ఢిల్లీకి కాంగ్రెస్ నేతలు, ఇక ప్రక్షాళన

Published : Dec 24, 2018, 03:46 PM IST
ఓటమిపై పోస్ట్‌మార్టమ్: ఢిల్లీకి కాంగ్రెస్ నేతలు, ఇక ప్రక్షాళన

సారాంశం

తెలంగాణ రాష్ట్రంలో ఇటీవల జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘోరంగా ఓటమి పాలు కావడంపై  ఆ పార్టీ జాతీయ నాయకత్వం సమీక్ష నిర్వహించనుంది. 

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో ఇటీవల జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘోరంగా ఓటమి పాలు కావడంపై  ఆ పార్టీ జాతీయ నాయకత్వం సమీక్ష నిర్వహించనుంది. ఈ సమీక్షకు ఢిల్లీకి రావాల్సిందిగా ముఖ్య నేతలకు కాంగ్రెస్ పార్టీ నాయకత్వం ఆదేశాలు జారీ చేసింది.

తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీకి ఈ నెల 7వ తేదీన జరిగిన ఎన్నికల్లో  టీఆర్ఎస్ 88 స్థానాల్లో విజయం సాధించింది. కాంగ్రెస్ పార్టీ కేవలం 19 స్థానాలకే పరిమితమైంది.
కాంగ్రెస్ పార్టీ ఘోరంగా ఓటమి పాలు కావడంపై  సమీక్ష నిర్వహించాలని ఆ పార్టీ నాయకులు కొందరు బహిరంగంగానే వ్యాఖ్యలు చేశారు. గెలిచిన అభ్యర్థులతో పాటు ఓడిపోయిన అభ్యర్థులను పిలిచి సమీక్ష నిర్వహించాలని కొందరు పార్టీ నాయకులు డిమాండ్ చేశారు.

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ  ఘోరంగా ఓటమి పాలు కావడంపై  ఈ నెల 26వ తేదీన కాంగ్రెస్ పార్టీ జాతీయ నాయకత్వం సమీక్ష నిర్వహించనుంది.ఈ సమీక్షలో  పార్టీ ఓటమికి గల కారణాలపై కారణాలను తేల్చనున్నారు.

విపక్షాలతో కూటమిని ఏర్పాటు చేసి  ఎన్నికల్లో పోటీ చేసినా కూడ కాంగ్రెస్ పార్టీ ఈ ఎన్నికల్లో  19 స్థానాలకే పరిమితమైంది.ఈ పరిణామాల నేపథ్యంలో పార్టీ ఓటమిపై లోతుగా చర్చించాల్సిన అవసరం ఉందని  ఆ పార్టీ  నేతలు కొందరు అభిప్రాయంతో ఉన్నారు.

కాంగ్రెస్ పార్టీకి చెందిన అగ్ర నేతలు  ఈ ఎన్నికల్లో ఓటమి పాలు కావడం కూడ ఆ పార్టీ నాయకత్వానికి మింగుడు పడడం లేదు. ఈ పరిణామాలన్నింటిపై కాంగ్రెస్ నాయకత్వం చర్చించనుంది. 

తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన తర్వాత కూడ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకపోవడంతో ఆ పార్టీ నాయకత్వం అసంతృప్తితో ఉంది. ఈ సమీక్ష తర్వాత కాంగ్రెస్  పార్టీలో కీలకమైన మార్పులు చోటు చేసుకొనే అవకాశాలు ఉంటాయని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

ఇప్పటికే  వరుసుగా రెండు దఫాలు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఓటమి పాలైంది. మరోవైపు ఆపరేషన్ ఆకర్ష్ పేరుతో కాంగ్రెస్ పార్టీకి చెందిన  ప్రజా ప్రతినిధులకు టీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్  గాలం వేస్తున్నారు ఈ తరుణంలో పార్టీని  ఈ ఐదేళ్ల పాటు దూకుడుగా నడిపించే నాయకత్వం అవసరమని  ఆ పార్టీకి చెందిన కొందరు నేతలు అభిప్రాయంతో ఉన్నారు. 

ఈ సమీక్ష తర్వాత పార్టీలో కీలకమైన మార్పులు చోటు చేసుకొనే అవకాశాలు ఉన్నాయని  చెబుతున్నారు. పీసీసీ నాయకత్వంలో కూడ మార్పులు చేర్పులు చోటు చేసుకొనే అవకాశాలు లేకపోలేదనే అభిప్రాయాలు కూడ వ్యక్తమౌతున్నాయి.

PREV
click me!

Recommended Stories

Singer Mangli in Multiple Controversies: మంగ్లీ చుట్టూ ఇన్ని వివాదాలా? | Asianet News Telugu
డబ్బులుంటేనే ఎవరైనా.. రేవంత్ రెడ్డి సంచలన ప్రెస్ మీట్ | Asianet News Telugu