నాగార్జునసాగర్ ఉప ఎన్నికల్లో ఉభయ కమ్యూనిష్టు పార్టీలు మద్దతివ్వాలని కాంగ్రెస్ పార్టీ కోరింది.
నాగార్జునసాగర్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధిగా జానారెడ్డి బరిలో ఉన్నాడు. జానారెడ్డికి మద్దతు ఇవ్వాలని కోరుతూ టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క లు లేఖ రాశాడు.
నల్గొండ: నాగార్జునసాగర్ ఉప ఎన్నికల్లో ఉభయ కమ్యూనిష్టు పార్టీలు మద్దతివ్వాలని కాంగ్రెస్ పార్టీ కోరింది.
నాగార్జునసాగర్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధిగా జానారెడ్డి బరిలో ఉన్నాడు. జానారెడ్డికి మద్దతు ఇవ్వాలని కోరుతూ టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క లు లేఖ రాశాడు.
సీపీఐ రాష్ట్ర సమితి కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రానికి కాంగ్రెస్ పార్టీ నాయకులు లేఖ రాశారు.
నాగార్జునసాగర్ ఉప ఎన్నికల్లో పోటీ చేస్తున్న కాంగ్రెస్ అభ్యర్ధికి మద్దతివ్వాలని కోరారు. సీపీఐ రాష్ట్ర సమితి కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రంతో కాంగ్రెస్ పార్టీ నేతలు చర్చించనున్నారు.