తెలంగాణ ప్రజలకు ఆరు గ్యారెంటీలు ప్రకటించారు కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ . వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చేలా ప్రజలందరూ అండగా ఉండాలని ఆమె కోరారు. ఈ గ్యారెంటీ స్కీంలు ప్రకటించడం పట్ల తాను ఎంతో సంతోషంగా ఉన్నానని సోనియా వ్యాఖ్యానించారు.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ దూకుడు పెంచింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రజలకు 6 గ్యారెంటీలు ఇస్తున్నట్లు ఆ పార్టీ అగ్రనేత సోనియా గాంధీ ప్రకటించారు. ఆదివారం రంగారెడ్డి జిల్లా తుక్కుగూడలో నిర్వహించిన విజయభేరి సభకు హాజరైన సోనియా మాట్లాడుతూ.. తెలంగాణ ప్రజలకు ఆరు వాగ్ధానాలు ఇచ్చారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం రావాలని, అన్ని వర్గాలకు మేలు జరిగేలా చేయాలనేదే తన స్వప్నం అని సోనియా అన్నారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చేలా ప్రజలందరూ అండగా ఉండాలని ఆమె కోరారు. తెలంగాణను తామే ఇచ్చామని, ఇకపై రాష్ట్రాన్ని ఉన్నత శిఖరాలకు తీసుకువెళ్తామని సోనియా స్పష్టం చేశారు. ఈ గ్యారెంటీ స్కీంలు ప్రకటించడం పట్ల తాను ఎంతో సంతోషంగా ఉన్నానని ఆమె వ్యాఖ్యానించారు.