పార్టీలో ఇంకా కోవర్టులు ఉన్నారు.. టీ కాంగ్రెస్ నేత అనిల్ యాదవ్ కీలక వ్యాఖ్యలు..

By Sumanth KanukulaFirst Published Aug 6, 2022, 3:49 PM IST
Highlights

తెలంగాణ కాంగ్రెస్ నేత అనిల్ యాదవ్ కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్‌లో ఇంకా కోవర్టులు ఉన్నారని ఆరోపించారు. అధిష్టానానికి లేఖలు రాసి కొందరు నష్టం చేస్తున్నారని విమర్శించారు.

తెలంగాణ కాంగ్రెస్ నేత అనిల్ యాదవ్ కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్‌లో ఇంకా కోవర్టులు ఉన్నారని ఆరోపించారు. అధిష్టానానికి లేఖలు రాసి కొందరు నష్టం చేస్తున్నారని విమర్శించారు. కోవర్టుల పనులు బంద్ చేయండి అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. పెద్ద మనషులు కూడా కోవర్ట్ చేస్తున్నారని ఆరోపించారు. అనిల్ యాదవ్ చేసిన వ్యాఖ్యలు టీ కాంగ్రెస్‌లో తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఇప్పటికే కాంగ్రెస్‌‌ పార్టీని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, దాసోజ్ శ్రవణ్ వంటి నేతలు వీడటం పార్టీకి ఇబ్బందికరంగా మారింది. వారిద్దరూ కూడా టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి లక్ష్యంగా విమర్శలు గుప్పించిన సంగతి తెలిసిందే. 

click me!