పాలమూరు-రంగారెడ్డి లిఫ్ట్‌ ఇరిగేషన్‌ ప్రాజెక్టుపై సీఎం కేసీఆర్‌ సమీక్ష.. అధికారుల‌కు కీల‌క ఆదేశాలు

Published : May 01, 2023, 11:22 PM IST
పాలమూరు-రంగారెడ్డి లిఫ్ట్‌ ఇరిగేషన్‌ ప్రాజెక్టుపై సీఎం కేసీఆర్‌ సమీక్ష.. అధికారుల‌కు కీల‌క ఆదేశాలు

సారాంశం

Hyderabad: పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకంపై ముఖ్య‌మంత్రి కేసీఆర్ సమీక్ష నిర్వ‌హించారు. పాలమూరు-రంగారెడ్డి లిఫ్టుల్లో అంతర్భాగంగా నిర్మిస్తున్న కరివెన, ఉదండాపూర్ రిజర్వాయర్ల నుంచి నారాయణపేట, కొడంగల్, వికారాబాద్ వరకు కాల్వల తవ్వకాలకు సంబంధించిన ఫైళ్లపై ఇదివరకు సీఎం కేసీఆర్ సంతకం చేశారు.  

Palamuru-Rangareddy lift irrigation project: సోమవారం కొత్త సచివాలయంలో జరిగిన తొలి సమావేశంలో ముఖ్య‌మంత్రి కే చంద్ర‌శేఖ‌ర్ రావు (కేసీఆర్) కరివెన రిజర్వాయర్ కు సంబంధించిన పనులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేసి జూలై నాటికి అందులోకి నీటిని తరలించాలని, ఆగస్టు నాటికి ఉదండాపూర్ రిజర్వాయర్ వరకు నీటిని ఎత్తిపోయాలని ఇరిగేషన్ అధికారులను ఆదేశించారు. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం (పీఆర్ఎల్ఐ)పై సమీక్ష నిర్వహించిన ముఖ్యమంత్రి ఒక రిజర్వాయర్ నుంచి మరో రిజర్వాయర్ కు నీటిని తరలించే పనులను 'కన్వేయర్ సిస్టమ్' ద్వారా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. తాండూరు, పరిగి, వికారాబాద్, కొడంగల్, చేవెళ్ల నియోజకవర్గాల్లో తాగునీటి అవసరాల కోసం కాలువలు తవ్వేందుకు టెండర్లు పిలవాలని అధికారులకు సూచించారు.

పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతలలో అంతర్భాగంగా నిర్మిస్తున్న కరివెన, ఉదండాపూర్ రిజర్వాయర్ల నుంచి నారాయణపేట, కొడంగల్, వికారాబాద్ వరకు కాలువల తవ్వకాలకు సంబంధించిన ఫైళ్లపై ఆదివారం సీఎం కేసీఆర్ సంతకం చేశారు. పెద్ద పీఆర్ఎల్ఐలో భాగంగా కరివెన రిజర్వాయర్ ను నిర్మిస్తున్నామనీ, ఈ ప్రాజెక్టును త్వరితగతిన పూర్తి చేయాలని ముఖ్యమంత్రి ఆకాంక్షించారు. న్యాయపరమైన చిక్కులు తలెత్తడంతో కొన్ని నెలల క్రితం రిజర్వాయర్ పనులను నిలిపివేశారు. ఈ పథకంలో భాగంగా ఉదండాపూర్ రిజర్వాయర్ నుంచి వికారాబాద్, నారాయణపేట జిల్లాలకు తాగునీరు అందించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులో తాగునీటి పనులు కొనసాగించేందుకు సుప్రీంకోర్టు అనుమతి ఇచ్చిన నేపథ్యంలో ఉమ్మడి మహబూబ్ నగర్, రంగారెడ్డి జిల్లాల్లో తాగునీటి సరఫరా పనుల పురోగతిపై చర్చించారు. కల్వకుర్తి, నెట్టెంపాడు, భీమా, కోయిల్ సాగర్ పనుల పురోగతిపై సమీక్షించిన ముఖ్యమంత్రి మిగిలిన పనులను జూన్ నాటికి పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.

ఈ సమావేశంలో మంత్రులు ఎస్.నిరంజ‌న్ రెడ్డి, వి.శ్రీనివాస్ గౌడ్, పీ సబితా ఇంద్రారెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఏ.శాంతికుమారి, సీఎం కార్యదర్శి స్మితాసబర్వాల్, ఆర్థికశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కే.రామకృష్ణారావు, నీటిపారుదలశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్ కుమార్, సీఎం ఓఎస్డీ (ఇరిగేషన్) శ్రీధర్ రావు త‌దితరులు పాల్గొన్నారు.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

ఉగాది పంచాంగ శ్రవణం కేటీఆర్ జాతకం చెప్పిన పండితులు KTR Attend Ugadi Celebrations | Asianet Telugu
Kavitha Kalvakuntla: డాడీ, మోడీ, చిన్న మోడీపైనే నా పోరాటం: కవిత సెటైర్లు | Asianet Telugu