వలసలపై అమిత్ షా క్లారిటీ: రాజకీయ పార్టీల్లో గుబులు

By Nagaraju penumalaFirst Published Jul 6, 2019, 6:52 PM IST
Highlights


ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో ఆపరేషన్ బీజేపీ అధికార విపక్ష పార్టీలకు చుక్కలు చూపిస్తోంది. ఏపీలో తెలుగుదేశం పార్టీని ఊడ్చేపనిలో పడింది. జనసేన నేతలకు సైతం గాలం వేస్తోంది. మరోవైపు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ నేతలను పార్టీలోకి చేర్చుకునే పనిలో పడింది. ఎన్నికల సమయంలో టీఆర్ఎస్ పార్టీలో కూడా గుబులు రేపింది బీజేపీ. 
 

హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల్లో వలసలపై క్లారిటీ ఇచ్చేశారు బీజేపీ చీఫ్ అమిత్ షా. తెలుగు రాష్ట్రాల్లో బీజేపీ బలోపేతం కావాలంటే సీనియర్ రాజకీయ వేత్తలు పార్టీలోకి రావాల్సిన అవసరం ఉందన్నారు. వలసలు ఉంటాయని చెప్పుకొచ్చారు. 

తెలుగు రాష్ట్రాల్లో బీజేపీ బలోపేతం అవుతుందని గట్టి నమ్మకం తనకు ఉందన్నారు. బీజేపీని బలోపేతం చేసేందుకు బలమైన నేతలను పార్టీలోకి చేర్చుకోవాలని సూచించారు. దక్షిణాది రాష్ట్రాల్లో భవిష్యత్ లో బీజేపీ జెండా ఎగురవేయడం ఖాయమన్నారు. 2024లో తెలంగాణలో అధికారంలోకి వచ్చేది బీజేపీయేనని ధీమా వ్యక్తం చేశారు అమిత్ షా. 

ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో ఆపరేషన్ బీజేపీ అధికార విపక్ష పార్టీలకు చుక్కలు చూపిస్తోంది. ఏపీలో తెలుగుదేశం పార్టీని ఊడ్చేపనిలో పడింది. జనసేన నేతలకు సైతం గాలం వేస్తోంది. మరోవైపు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ నేతలను పార్టీలోకి చేర్చుకునే పనిలో పడింది. ఎన్నికల సమయంలో టీఆర్ఎస్ పార్టీలో కూడా గుబులు రేపింది బీజేపీ. 

తెలుగు రాష్ట్రాల్లో బీజేపీ బలోపేతం కావాలంటే బలమైన నాయకులను పార్టీలోకి చేర్చుకోవాలంటూ అమిత్ షా ఆదేశాలు జారీ చేయడంతో వలసలపై రాజకీయ పార్టీల్లో ఆందోళన నెలకొంది. ఏ పార్టీని ఈసారి బీజేపీ టార్గెట్ చేస్తోందా అంటూ ఆసక్తికర చర్చ జరుగుతోంది. 

ఈ వార్తలు కూడా చదవండి

తెలంగాణలో అతిపెద్దపార్టీగా అవతరిస్తాం, జెండా ఎగురవేస్తాం: అమిత్ షా

హైదరాబాద్ కు అమిత్ షా, తండాలో భోజనం చేసిన కేంద్రహోంమంత్రి

జనసేన నేతకు షాక్: బీజేపీలో చేరిన మాజీ సీఎం నాదెండ్ల, కండువాకప్పిన అమిత్ షా

click me!