హైద్రాబాద్‌ జీఎస్టీ ఆఫీస్‌లో సీబీఐ సోదాలు: లంచం తీసుకొన్న ఇద్దరి అరెస్ట్

By narsimha lodeFirst Published Oct 26, 2021, 6:23 PM IST
Highlights

 బషీర్‌బాగ్ లోని కస్టమ్స్ యాంటీ వింగ్ లో పనిచేస్తున్న ఇద్దరు అధికారులు లంచం తీసుకొన్నారనే కారణంగా సీబీఐ అరెస్ట్ చేసింది. కిషన్ పాల్, సురేష్ లు రూ. 20 వేలు లంచం తీసుకొన్నారని సీబీఐ ఆరోపించింది.

హైదరాబాద్: Hyderabad నగరంలోని బషీర్ బాగ్ లో గల Gst కార్యాలయంలోని గల Customs  యాంటీ విస్సన్ వింగ్ లో పనిచేస్తున్న ఇద్దరు అధికారులనుCbi మంగళవారం నాడు అరెస్ట్ చేసింది. ఓ వ్యాపారి నుండి లంచం తీసుకొన్నారని వీరిద్దరిని సీబీఐ అరెస్ట్ చేసింది.కస్టమ్స్  యాంటీ విస్సన్ వింగ్ లో పనిచేస్తున్న ఇన్‌స్పెక్టర్ కిషన్ పాల్, సూపరిండెంట్ సురేష్ కుమార్‌లను సీబీఐ అరెస్ట్ చేసింది. ఈ ఇద్దరు అధికారులకు రూ. 20 వేలు లంచం ఇచ్చి సీబీఐకి ఫిర్యాదు చేశాడు బాధితుడు మీర్ అస్ఘర్. ఈ ఇద్దరు అధికారులు లంచం తీసుకొంటున్న సమయంలో సీబీఐ అధికారులు సోమవారం నాడు దాడులు నిర్వహించారు.

also read:హైద్రాబాద్‌లో సోదాలు: ఇద్దరిని ట్రాప్ చేసిన సీబీఐ

ఈ దాడుల తర్వాత  Kishan paul , Suresh లను అదుపులోకి తీసుకొని ప్రశ్నించింది సీబీఐ. వీరిద్దరూ లంచం తీసుకొన్నారని సీబీఐ నిర్ధారణ చేసుకొంది. దీంతో మంగళవారం నాడు నిందితులను అరెస్ట్ చేసింది.హైకోర్టు ఆదేశాలతో విడుదలైన వ్యక్తి నుండి ఈ ఇద్దరు అధికారులు లంచం తీసుకొన్నారని సీబీఐ చెబుతుంది. వీరిద్దరని కోర్టులో హాజరుపర్చారు  సీబీఐ అధికారులు.Gst అమలైన తర్వాత వ్యాపారులు సక్రమంగా పన్నులు చెల్లించకుండా ఉన్న వారిపై కొందరు అధికారులు పన్నులు వసూలు కాకుండా ఉండేందుకు గాను అక్రమాలకు పాల్పడుతున్నారనే ఆరోపణలున్నాయి.  దీంతో  ఈ విషయమై సీబీఐకి ఫిర్యాదులు అందాయి. ఈ ఫిర్యాదుల ఆధారంగా సీబీఐ అధికారులు సోదాలు నిర్వహించారు.


 

click me!