ఓటుకు నోటు కేసు: కాంగ్రెస్ నేత రవిశంకర్ కు పోలీసుల నోటీసులు

By narsimha lodeFirst Published Aug 26, 2021, 9:31 AM IST
Highlights

ఓటుకు నోటు కేసులో కాంగ్రెస్ నేత రవిశంకర్ కు పోలీసులు నోటీసులు పంపారు. సెప్టెంబర్ 9వ తేదీన విచారణకు హాజరు కావాలని పోలీసులు కోరారు.  ఈ కేసులో నిందితులుగా ఉన్న రేవంత్ రెడ్డి, సండ్ర వెంకటవీరయ్య దాఖలు చేసిన పిటిషన్లపై ఇవాళ సుప్రీంకోర్టు విచారణ నిర్వహించనుంది.

హైదరాబాద: ఓటుకు నోటు  కేసులో కాంగ్రెస్ నేత రవిశంకర్ కు పోలీసులు నోటీసులు జారీ చేశారు. సెప్టెంబర్ 9వ తేదీన విచారణకు హాజరు కావాలని ఆ నోటీసులో పోలీసులు పేర్కొన్నారు.

 2015లో తెలంగాణ రాష్ట్రంలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో   కొందరు ఎమ్మెల్యేలు,,ఎమ్మెల్సీలను కొనుగోలు చేసేందుకు అప్పటి టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి ప్రయత్నించారని ఏసీబీ కేసు నమోదు చేసింది. నామినేటేడ్ ఎమ్మెల్సీ స్టీఫెన్ సన్ ఇంట్లో డబ్బుల సంచులతో రేవంత్ రెడ్డి దొరికిన్టుగా ఏసీబీ కేసు నమోదు చేసింది.

ఈ కేసు దర్యాప్తు ఇంకా కొనసాగుతోంది. అయితే ఈ కేసులో ఆరోపణలు నిందితులుగా ఉన్న ప్రజా ప్రతినిధులు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య ఈ కేసులో తన పేరును తొలగించాలని సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. మరోవైపు ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ కేసులో ఏసీబీ చట్టం వర్దించదని 
 

click me!