ముల్కనూరులో ఎట్టకేలకు బయటపడ్డ కారు.. లోపల మృతదేహం, రిటైర్డ్ ఎస్సైగా గుర్తింపు

By Siva KodatiFirst Published Jul 29, 2021, 8:54 PM IST
Highlights

కరీంనగర్‌ జిల్లా చిగురుమామిడి మండలం చిన్న మల్కనూరు వద్ద బావిలోకి  దూసుకెళ్లిన కారును ఎట్టకేలకు అధికారులు బయటకు తీశారు. బయటపడిన మృతదేహాన్ని భీమదేవరపల్లి మండలానికి చెందిన రిటైడ్ ఎస్సై పాపయ్య నాయక్‌గా గుర్తించారు. 

గురువారం ఉదయం కరీంనగర్‌ జిల్లా చిగురుమామిడి మండలం చిన్న మల్కనూరు వద్ద బావిలోకి  దూసుకెళ్లిన కారును ఎట్టకేలకు అధికారులు బయటకు తీశారు. బావిలో దాదాపు 60 అడుగుల మేర నీరు ఉండటంతో కారును బయటకు తీయడం  అగ్నిమాపక, ఎన్డీఆర్‌ఎఫ్‌ సిబ్బందికి కష్టంగా మారింది. సుమారు 8 గంటల పాటు శ్రమించిన అధికారులు ఎట్టకేలకు క్రేన్‌ సాయంతో కారును బయటకు తీశారు. కారు అద్దాలు తెరచి చూడగా.. కారులో ఒక్కరే ఉన్నట్టు గుర్తించారు. కారు కరీంనగర్‌ నుంచి హుస్నాబాద్‌ వైపు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగిందని అధికారులు తెలిపారు. బయటపడిన మృతదేహాన్ని భీమదేవరపల్లి మండలానికి చెందిన రిటైడ్ ఎస్సై పాపయ్య నాయక్‌గా గుర్తించారు. 
 

click me!