ఎస్సారెస్సీ కెనాల్ లోకి దూసుకెళ్లిన కారు...ఒకరు మృతి, ముగ్గురు గల్లంతు

Arun Kumar P   | Asianet News
Published : Feb 10, 2021, 11:40 AM ISTUpdated : Feb 10, 2021, 11:46 AM IST
ఎస్సారెస్సీ కెనాల్ లోకి దూసుకెళ్లిన కారు...ఒకరు మృతి, ముగ్గురు గల్లంతు

సారాంశం

వేగంగా వెళుతున్న కారు అదుపుతప్పి కాలువలోకి దూసుకెళ్లగా... ఆ నీటిలో మునిగి ఒకరు మృతి చెందగా మరో ముగ్గురు గల్లంతయ్యారు. 

వరంగల్: తెల్లవారుజామున వేగంగా వెళుతున్న ఓ కారు నీటి కాలువలోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదం వరంగల్ జిల్లాలో చోటుచేసుకుంది. కాలువ నీటిలో మునిగి ఒకరు మృతి చెందగా మరో ముగ్గురు గల్లంతయ్యారు. ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు స్థానికుల సాయంతో కారును కెనాల్ నుండి బయటకు లాగారు. గల్లంతయిన వారికోసం గాలింపు చేపట్టారు. 

ఈ ప్రమాదంలో మృతి చెందిన వ్యక్తి ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా తెలుస్తోంది. అతివేగంతో వెళుతున్న కారు అదుపుతప్పడం వల్లే కారు కెనాల్ లోకి దూసుకెళ్లినట్లు స్థానికులు చెబుతున్నారు. ఈ ప్రమాదం  వరంగల్ రూరల్ జిల్లా పర్వతగిరి మండలంలోని కొంకపాక శివారులో ఎస్సారెస్పీ కెనాల్ లో చోటుచేసుకుంది. 

కారు ప్రమాదంలో గల్లంతయిన వారి వివరాలు తెలియాల్సి వుంది. ఓ వైపు కాలువలో మృతదేహాలను గాలిస్తూనే మరోవైపు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పటికే లభించిన మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఏరియా ఆస్పత్రికి తరలించారు.

 

PREV
click me!

Recommended Stories

IMD Rain Alert : తెలుగు రాష్ట్రాల్లో జోరువానలు.. అత్యధిక వర్షపాతం నమోదైన టాప్ 10 ప్రాంతాలివే..
Real Estate: తెలంగాణ‌లో 2 కొత్త ఎయిర్ పోర్టుల‌కు ముహుర్తం ఖ‌రారు.. ఇక్క‌డ భూములు కొన్న వారి రాత మారిన‌ట్లే