హైదరాబాద్‌లో ఆటోలు, క్యాబ్‌ల సమ్మె...ప్రయాణీకుల అవస్థలు

sivanagaprasad kodati |  
Published : Jan 08, 2019, 08:39 AM IST
హైదరాబాద్‌లో ఆటోలు, క్యాబ్‌ల సమ్మె...ప్రయాణీకుల అవస్థలు

సారాంశం

2018 ఎంవీ యాక్ట్ సవరణ బిల్లును ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ దేశవ్యాప్తంగా పలు కార్మిక సంఘాలు రెండు రోజుల పాటు సమ్మెకు పిలుపునిచ్చాయి. ఈ నేపథ్యంలో దేశంలోని ప్రధాన పట్టణాలు, నగరాల్లో రవాణా సేవలు నిలిచిపోయాయి. 

2018 ఎంవీ యాక్ట్ సవరణ బిల్లును ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ దేశవ్యాప్తంగా పలు కార్మిక సంఘాలు రెండు రోజుల పాటు సమ్మెకు పిలుపునిచ్చాయి. ఈ నేపథ్యంలో దేశంలోని ప్రధాన పట్టణాలు, నగరాల్లో రవాణా సేవలు నిలిచిపోయాయి.

ప్రైవేటు బస్సులు, లారీలు, కార్లు, ఆటోలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. దీని ప్రభావం హైదరాబాద్ మీద పడింది. ఉదయం నుంచే భాగ్యనగరంలో ఆటోలు, క్యాబ్‌లు రోడ్డెక్కలేదు.. ఈ సమ్మెకు తెలంగాణ మజ్దూర్ యూనియన్ మద్ధతు తెలిపింది.

ఇదే సమయంలో న్యూడెమోక్రసీ, టీ మాస్ ఫోరమ్ కూడా మద్ధతు ప్రకటించాయి. క్యాబ్‌లు, ఆటోల సేవలు నిలిచిపోవడంతో ఉద్యోగులు, విద్యార్థులు ఇతర ప్రయాణీకులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

PREV
click me!

Recommended Stories

రియ‌ల్ ఎస్టేట్‌లో ఇలాంటి మోసాలు కూడా జ‌రుగుతాయా.? చ‌నిపోయిన మ‌హిళ పేరుతో రూ. 2.5 కోట్లు స్వాహా
ఇరాన్‌లో బాంబులు పేలితే మ‌న వంటింట్లో మంట‌లు పుడుతున్నాయి.. మొద‌లైన ప్ర‌భావం.