అప్పు తీర్చమంటే చంపారు:హైద్రాబాద్‌లో వ్యాపారి మధుసూధన్ రెడ్డి హత్య

Published : Aug 22, 2021, 11:37 AM IST
అప్పు తీర్చమంటే చంపారు:హైద్రాబాద్‌లో వ్యాపారి మధుసూధన్ రెడ్డి హత్య

సారాంశం

పాతబస్తీలో వ్యాపారవేత్త మధుసూదన్ రెడ్డి కిడ్నాప్ చేసి అతని మిత్రులే ఆయనను హత్యచేశారు.చార్మినార్ నుండి అతడిని తీసుకెళ్లి సంగారెడ్డిలో హత్య  చేశారని పోలీసులు గుర్తించారు. పొలంలో మృతదేహన్ని పూడ్చిపెట్టారు. ఈ హత్యలో పాల్గొన్న నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు.

హైదరాబాద్: హైద్రాబాద్ నగరంలోని పాతబస్తీకి చెందిన వ్యాపారి మధుసూదన్ రెడ్డిని అతని మిత్రులే కిడ్నాప్ చేసి హత్య చేశారు. ఈ నెల 19వ తేదీన మధుసూదన్ రెడ్డి కిడ్నాపయ్యారు.ఈ విషయమై ఆయన  కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

మధుసూదన్ రెడ్డి తన మిత్రులకు రూ. 40 లక్షలను అప్పుగా ఇచ్చారు. ఈ డబ్బులను తిరిగి ఇవ్వాలని మిత్రులను కోరాడు. అయితే ఈ డబ్బులు తిరిగి ఇవ్వని మిత్రులు అతడిని హత్య చేయాలని నిర్ణయం తీసుకొన్నారు. 

ఈ నెల 19వ తేదీన మధుసూదన్ రెడ్డిని మిత్రులే పథకం ప్రకారంగా కిడ్నాప్ చేశారు.  చార్మినార్ నుండి అతడిని సంగారెడ్డికి తీసుకెళ్లారు. అక్కడే అతడిని హత్య చేశారు. మృతదేహన్ని ఓ పొలంలో పూడ్చిపెట్టారు. 

ఈ హత్యలో పాల్గొన్న   ఓ నిందితుడిని పోలీసులు  అదుపులోకి తీసుకొన్నారు. ఈ హత్యలో ఎవరెవరి ప్రమేయం ఉందనే విషయమై కూడ పోలీసులు ఆరా తీస్తున్నారు.
 

PREV
click me!

Recommended Stories

పేమెంట్ అయిన‌ట్లు సౌండ్ వ‌స్తుంది కానీ డ‌బ్బులు ప‌డ‌వు.. ఫోన్‌పేలో కొత్త స్కామ్‌. జాగ్ర‌త్త‌!
Renu Desai Angry Over Social Media Comments: నెటిజన్ల బూతు కామెంట్లపై రెచ్చిపోయిన రేణుదేశాయ్