తేలు కాటుతో బీటెక్ విద్యార్థిని మృతి.. సిరిసిల్లలో విషాదం...

Published : Sep 14, 2022, 07:56 AM IST
తేలు కాటుతో బీటెక్ విద్యార్థిని మృతి.. సిరిసిల్లలో విషాదం...

సారాంశం

తేలు కాటు వేయడం వల్ల ఓ బీటెక్ విద్యార్థిని మృతి చెందిన ఘటన సిరిసిల్లలో విషాదం నింపింది. 

సిరిసిల్ల : తేలు కాటు వేయడంతో బీటెక్ చదువుతున్న ఓ యువతి మృతి చెందింది. ఈ ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లాలో మంగళవారం చోటుచేసుకుంది.  సిరిసిల్ల మున్సిపల్ పరిధిలోని రగుడుకు చెందిన దొంతుల మాలతి (21)  హైదరాబాదులో బీటెక్ లాస్ట్ ఇయర్  చదువుతోంది.  ఆమె ఇటీవల ఇంటికి వచ్చింది.  ఆదివారం సొంత పొలంలో వ్యవసాయ పనులు చేస్తుండగా ఆమె వేసుకున్న చొక్కా లో ఉన్న తేలు పలుచోట్ల కాటేసింది.  విషయం గమనించి  వెంటనే  కుటుంబ సభ్యులు ఆమెను కరీంనగర్ లోని ఆస్పత్రికి తరలించారు.  అక్కడ ఆమె చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందింది. 

PREV
click me!

Recommended Stories

Weather Update: ఏపీ, తెలంగాణలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
Onion and Sugar Prices: తెలుగు రాష్ట్రాల్లో ఉల్లి చక్కెర మంట.. అసలు ధరలు ఎందుకు పెరుగుతున్నాయి?