మంత్రులు కాన్వాయ్‌ను అడ్డుకున్న బీఎస్పీ కార్యకర్తలు.. కరీంనగర్ కలెక్టరేట్ వద్ద ఉద్రిక్తత..

By Sumanth KanukulaFirst Published Sep 14, 2022, 2:34 PM IST
Highlights

కరీంనగర్ కలెక్టరేట్ వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. గురుకుల పాఠశాల్లో సమస్యలను పరిష్కరించాలని కరీంనగర్ కలెక్టరేట్ ముందు బీఎస్పీ నాయకులు ఆందోళకు దిగారు. 

కరీంనగర్ కలెక్టరేట్ వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. గురుకుల పాఠశాల్లో సమస్యలను పరిష్కరించాలని కరీంనగర్ కలెక్టరేట్ ముందు బీఎస్పీ నాయకులు ఆందోళకు దిగారు. మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, గంగుల కమలాకర్ కాన్వాయ్‌ను బీఎస్పీ కార్యకర్తలు అడ్డుకున్నారు. సంక్షేమ హాస్టళ్లను బలోపేతం చేయాలని డిమాండ్ చేశారు. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం చోటుచేసకుంది. దీంతో వెంటనే స్పందించిన పోలీసులు.. బీఎస్పీ కార్యకర్తలను చెదరగొట్టారు. అయితే ప్రభుత్వం వెంటనే ప్రభుత్వ గురుకుల పాఠశాల్లో సమస్యలను పరిష్కారించాలని.. లేకపోతే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని బీఎస్పీ నాయకులు హెచ్చరించారు. 


 

click me!