మాజీ మంత్రి నాగం జనార్దన్ రెడ్డి అడ్డగింత.. బీఆర్ఎస్, కాంగ్రెస్ శ్రేణుల మధ్య ఘర్షణ.. తీవ్ర ఉద్రిక్తత..

Published : Jan 07, 2023, 01:07 PM IST
 మాజీ మంత్రి నాగం జనార్దన్ రెడ్డి అడ్డగింత.. బీఆర్ఎస్, కాంగ్రెస్ శ్రేణుల మధ్య ఘర్షణ.. తీవ్ర ఉద్రిక్తత..

సారాంశం

నాగర్‌కర్నూలు జిల్లా మాయమ్మపల్లిలో బీఆర్ఎస్, కాంగ్రెస్ నేతల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. దీంతో అక్కడ తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. 

నాగర్‌కర్నూలు జిల్లా మాయమ్మపల్లిలో బీఆర్ఎస్, కాంగ్రెస్ నేతల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. దీంతో అక్కడ తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. వివరాలు.. మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత బిజినేపల్లి సమీపంలోని మార్కండేయ రిజర్వాయర్ పనులను పరిశీలించేందుకు వెళ్లారు. అయితే నాగం జనార్ధన్ రెడ్డిని, ఆయన అనుచరులను బీఆర్ఎస్ శ్రేణులు అడ్డుకున్నాయి. ఇక్కడ పని ఏమిటని నాగం జనార్దన్‌రెడ్డిని ప్రశ్నించారు. ఈ క్రమంలోనే ఇరు పార్టీల నేతల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఈ క్రమంలోనే ఇరు పార్టీల నేత తోపులాట జరిగింది. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అయితే పోలీసులు రంగంలోకి దిగి ఇరు పార్టీల నేతలను చెదరగొట్టడంతో అక్కడ పరిస్థితి చక్కబడింది.  

PREV
click me!

Recommended Stories

School Holidays : ఈ గురువారం స్కూళ్ళకు సెలవేనా..? ఎందుకో తెలుసా?
Air Pollution : హైదరాబాద్ మరో డిల్లీ అవుతోందా..! ఈ ప్రాంతాల్లో మరీ ఇంత కాలుష్యమా..!!