హుజురాబాద్‌లో నవ వధువు కిడ్నాప్ కలకలం.. పెళ్లి చేసుకున్న కొద్దిసేపటికే ఘటన..

Published : May 25, 2023, 12:52 PM IST
హుజురాబాద్‌లో నవ వధువు కిడ్నాప్ కలకలం.. పెళ్లి చేసుకున్న కొద్దిసేపటికే ఘటన..

సారాంశం

కరీంనగర్ జిల్లాలోని హుజూరాబాద్‌లో నవ వధువు కిడ్నాప్ కలకలం రేపింది. ఓ జంట జగిత్యాల జిల్లా కొండగట్టు ఆలయంలో ప్రేమ వివాహం చేసుకుని తిరిగి వెళ్తుండగా  కొందరు వ్యక్తులు నవ వధువును కిడ్నాప్ చేశారు.

కరీంనగర్ జిల్లాలోని హుజూరాబాద్‌లో నవ వధువు కిడ్నాప్ కలకలం రేపింది. ఓ జంట జగిత్యాల జిల్లా కొండగట్టు ఆలయంలో ప్రేమ వివాహం చేసుకుని తిరిగి వెళ్తుండగా  కొందరు వ్యక్తులు నవ వధువును కిడ్నాప్ చేశారు. అదే సమయంలో వరుడిపై కూడా దాడి చేశారు. వివరాలు.. కిడ్నాప్‌గురైన నవ వధువు హనుమకొండ జిల్లా మడికొండ గ్రామం కాగా.. వరుడు స్వస్థలం వరంగల్. అయితే వీరు ప్రేమలో ఉన్నారు. ఈ క్రమంలోనే  కొండగట్టులో ప్రేమ వివాహం చేసుకున్నారు. 


పెళ్లి చేసుకుని ఇంటికి వెళ్తుండగా.. కారులో వచ్చిన కొంత మంది హుజురాబాద్ అంబేడ్కర్ విగ్రహం  వారిని అడ్డుకుని.. నవ వధువను కిడ్నాప్ చేశారు. అయితే వధువు తరఫు బంధువులే ఈ పని చేశారని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు సీసీటీవీ కెమెరాల్లో రికార్డయ్యాయి. 

PREV
click me!

Recommended Stories

క్యాన్సర్ ఆసుపత్రి రజతోత్సవంలో వెంకయ్య నాయుడు పవర్ ఫుల్ స్పీచ్ | Venkaiah Naidu Powerful Speech
నేను సాఫ్ట్‌వేర్ మాత్రమే కాదు హార్డ్‌వేర్ కూడా.. రేవంత్ రెడ్డి KTR స్ట్రాంగ్ కౌంటర్ | Asianet Telugu