దేశానికి మీ గురించి తెలిసిపోయిందని వణికిపోతున్నారా : కేటీఆర్‌కు బండి సంజయ్ కౌంటర్

Siva Kodati |  
Published : Aug 12, 2023, 03:59 PM IST
దేశానికి మీ గురించి తెలిసిపోయిందని వణికిపోతున్నారా : కేటీఆర్‌కు బండి సంజయ్ కౌంటర్

సారాంశం

మంత్రి కేటీఆర్‌పై విమర్శలు గుప్పించారు తెలంగాణ బీజేపీ మాజీ అధ్యక్షుడు , కరీంనగర్ ఎంపీ బండి సంజయ్. తన ప్రసంగానికి మంత్రి భయపడ్డారని.. బీఆర్ఎస్ పాలన తీరును, వైఫల్యాలను ఎండగట్టడంతో వణికిపోతున్నారా అంటూ ఎద్దేవా చేశారు. 

మంత్రి కేటీఆర్‌పై విమర్శలు గుప్పించారు తెలంగాణ బీజేపీ మాజీ అధ్యక్షుడు , కరీంనగర్ ఎంపీ బండి సంజయ్. ఈ మేరకు శనివారం ఆయన ట్వీట్ చేశారు.. లోక్‌సభలో తాను చేసిన ప్రసంగంపై కేటీఆర్ అన్న మాటలకు కౌంటరిచ్చారు. తన ప్రసంగానికి మంత్రి భయపడ్డారని.. బీఆర్ఎస్ పాలన తీరును, వైఫల్యాలను ఎండగట్టడంతో వణికిపోతున్నారా అంటూ ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్ గురించి ఇప్పుడు దేశం మొత్తానికి తెలిసిపోయిందని.. మోడీ నేతృత్వంలో రాబోయే డబుల్ ఇంజిన్ ప్రభుత్వం కారును తుక్కు తుక్కు చేస్తుందని బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు చేశారు. 

మీ కుటుంబ ఆదాయం ఎలా పెరిగిందో ఇప్పుడు యావత్ దేశానికి తెలిసిందని.. కాంగ్రెస్, ఎంఐఎంలతో దోస్తీని ప్రదర్శిస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్ధులు, రైతులు , ఆర్టీసీ కార్మికులు, ఉపాధ్యాయుల జీవితాలతో బీఆర్ఎస్ ప్రభుత్వం ఎలా ఆడుకుంది అనే విషయాలను బయటపెట్టడంతో బీఆర్ఎస్ ప్రభుత్వం వణికిపోతోందని సంజయ్ ట్వీట్‌లో పేర్కొన్నారు. 

 

 

కాగా.. కేటీఆర్ నిన్న ట్వీట్ చేశారు. రెండు సార్లు సీఎంగా ఎన్నికైన కేసీఆర్ పై లోక్ సభలో బండి సంజయ్ నీచమైన భాషలో మాట్లాడారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మరి ఇప్పుడు ఆయనపై ఎలాంటి చర్యలు తీసుకుంటారని స్పీకర్ ఓం బిర్లాను ఆయన ప్రశ్నించారు. ప్రధాని ఇంటి పేరును కించపరిచే విధంగా మాట్లాడినందుకు ఓ ఎంపీని లోక్ సభ నుంచి సస్పెండ్ చేశారని పరోక్షంగా రాహుల్ గాంధీ అనర్హతను గుర్తు చేశారు. 

‘‘ ప్రధాని ఇంటిపేరును కించపరిచే విధంగా పిలిచినందుకు కాంగ్రెస్ కు చెందిన ఓ ఎంపీని ఆయన సభ్యత్వానికి అనర్హులుగా ప్రకటించారు. ఇప్పుడు తెలంగాణకు చెందిన ఓ బీజేపీ ఎంపీ నిన్న లోక్ సభలో తెలంగాణకు చెందిన రెండుసార్లు ఎన్నికైన పాపులర్ సీఎం కేసీఆర్ ను నీచమైన భాషలో దూషించారు. స్పీకర్ సర్ ఇప్పుడు మీరు/మేము ఏమి చేయాలి? ’’ అని బండి సంజయ్ ను ఉద్దేశించి ఆయన పేర్కొన్నారు. ఈ ట్వీట్ కు లోక్ సభ స్వీకర్ ఓం బిర్లాను ట్యాగ్ చేశారు. 

లోక్ సభలో గురువారం బండి సంజయ్ మాట్లాడుతూ.. తెలంగాణ సీఎం కేసీఆర్ పై, బీఆర్ఎస్ పై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. అవినీతి యూపీఏ  ఎలా ఇండియాగా మారిందో  అదే అవినీతి టీఆర్ఎస్  బీఆర్ఎస్ గా మారిందన్నారు. కేసీఆర్ పేరును  ఖాసీం చంద్రశేఖర్ రజ్వీ అని బండి సంజయ్ సంబోధించారు.  కేసీఆర్ సర్కార్  విధానాలతో తెలంగాణలో రైతులు నాశనమౌతున్నారన్నారు.  డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల పేరు చెప్పి ప్రజలను కేసీఆర్ సర్కార్ మోసం చేస్తుందని  ఆయన  విమర్శించారు.

మోడీ మణిపూర్ వెళ్లలేదని బీఆర్ఎస్ విమర్శలు చేయడాన్ని బండి సంజయ్ ప్రస్తావిస్తూ  తెలంగాణలో  ఇంటర్ విద్యార్థులు, రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే కేసీఆర్  వెళ్లారా అని ప్రశ్నించారు.  తెలంగాణలో  విద్యుత్ కు 24 గంటల పాటు విద్యుత్ ఇవ్వకపోతే  కేసీఆర్ సర్కార్  రాజీనామా చేస్తుందా అని ఆయన అన్నారు. తెలంగాణ సీఎం కుటుంబ సభ్యుల ఆస్తులు విపరీతంగా పెరిగాయని ఆరోపించారు. తెలంగాణ సీఎం కుమారుడు ఆస్తులు 400 రేట్లు పెరిగాయని బండి సంజయ్ అన్నారు.
 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

School Holidays : ఈ గురువారం స్కూళ్ళకు సెలవేనా..? ఎందుకో తెలుసా?
Air Pollution : హైదరాబాద్ మరో డిల్లీ అవుతోందా..! ఈ ప్రాంతాల్లో మరీ ఇంత కాలుష్యమా..!!