రేవంత్ బ్లాక్‌మెయిల్ చేసి ఎదిగాడు.. నాలుగు పార్టీలు మారలేదా?: ఈటల రాజేందర్

Published : Aug 03, 2022, 12:50 PM IST
రేవంత్ బ్లాక్‌మెయిల్ చేసి ఎదిగాడు.. నాలుగు పార్టీలు మారలేదా?: ఈటల రాజేందర్

సారాంశం

దేశంలో అంతరించిపోతున్న పార్టీ కాంగ్రెస్ అని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ రెడ్డి అన్నారు. రేవంత్ రెడ్డి బ్లాక్ మెయిల్ చేసి ఎదిగాడని విమర్శించారు. ఆయన నాలుగు పార్టీలు మారలేదా? అని ప్రశ్నించారు. 

దేశంలో అంతరించిపోతున్న పార్టీ కాంగ్రెస్ అని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ రెడ్డి అన్నారు. రేవంత్ రెడ్డి బ్లాక్ మెయిల్ చేసి ఎదిగాడని విమర్శించారు. ఆయన నాలుగు పార్టీలు మారలేదా? అని ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ గెలవదనే నిరాశ, నిస్పృహలతో రేవంత్ మాట్లాడుతున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ పెద్దల అహంకారం వల్లే ఆ పార్టీకి ఈ పరిస్థితి అని విమర్శించారు. ప్రాంతీయ పార్టీల పుట్టుకకు కారణం కాంగ్రెస్సేనని అన్నారు. ముఖ్యమంత్రులను లెక్క చేయని అహంకారం ఆ పార్టీది అని విమర్శించారు. ముఖ్యమంత్రలు ఆత్మగౌరవం తాకట్టు పెట్టారని ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వచ్చారని అన్నారు.

దేశవ్యాప్తంగా ఇవాళ కాంగ్రెస్ పరిస్థితి గురించి మాట్లాడుకోవాల్సిన అవసరం లేదన్నారు. ఒక్క రాజస్థాన్ లోనే ఉన్నట్లుందని అన్నారు. మహారాష్ట్రలో ఏక్ నాథ్ షిండే ఆయన ధర్మాన్ని నిర్వర్తించాడని చెప్పారు. బీజేపీ సిద్దాంతం ఉన్న పార్టీ అని అన్నారు. మహారాష్ట్రలో బీజేపీకి మెజారిటీ వచ్చిందన్నారు. కానీ శివసేన అపవిత్ర పొత్తుకు శ్రీకారం చుట్టిందన్నారు.  సిద్ధాంతంలో బాల్ థాకరే అందె వేసినవారని చెప్పారు. ప్రజలు ఛీకొడుతుంటే ఉద్ధవ్ థాకరేకు ఏక్‌నాథ్ షిండే ఎదురు తిరిగారని అన్నారు. 

యూపీలో 403 స్థానాలు ఉంటే.. కాంగ్రెస్ ఎన్ని గెలిచిందని ప్రశ్నించారు. రాహుల్ గాంధీని తిరస్కరిస్తే కేరళకు వెళ్లాల్సి వచ్చిందని ఎద్దేవా చేవారు. తమిళనాడులో స్టాలిన్‌కు, జార్ఖండ్‌లో సోరెన్‌కు టీఆర్ఎస్ డబ్బులు పంపిందని ఆరోపించారు. అలాంటప్పుడు టీఆర్ఎస్‌కు కాంగ్రెస్ ప్రత్యామ్నాయం ఎలా అవుతుందని ప్రశ్నించారు. ఉద్యమ సమయంలోనే రాజగోపాల్ రెడ్డిని టీఆర్ఎస్‌లోకి ఆహ్వానించామని చెప్పారు. మంత్రి పదవి ఇస్తామని చెప్పినా ఆయన టీఆర్ఎస్‌లోకి రాలేదన్నారు. ఆర్థికంగా దెబ్బతీసినా కాంగ్రెస్‌లోనే ఉన్నారని చెప్పారు. 

నల్గొండ జిల్లాలో ఉప ఎన్నికల రాబోతుందని.. అక్కడ ప్రజలు కేసీఆర్ అహంకారం ఓడిపోతుందా? లేదా? అని ప్రజలు ఆలోచిస్తున్నారని చెప్పారు. చనిపోతున్న కాంగ్రెస్ గురించి ఆలోచించడం లేదన్నారు.  

PREV
click me!

Recommended Stories

KTR Speech: కేసీఆర్ ని ముఖ్యమంత్రి చేస్తాం.. ఎదురు దెబ్బలు పట్టించుకోము | Asianet News Telugu
Hyderabad Police Commissioner VC Sajjanar Celebrate New Year at Charminar HYD | Asianet News Telugu