కిషన్ రెడ్డి ప్రమాణం.. మధ్యలోనే వెళ్లిపోయిన విజయశాంతి, కిరణ్ రెడ్డిపై సెటైర్లు

Siva Kodati |  
Published : Jul 21, 2023, 06:46 PM ISTUpdated : Jul 21, 2023, 07:16 PM IST
కిషన్ రెడ్డి ప్రమాణం.. మధ్యలోనే వెళ్లిపోయిన విజయశాంతి, కిరణ్ రెడ్డిపై సెటైర్లు

సారాంశం

తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేస్తుండగా మధ్యలోనే వచ్చేయడంపై స్పందించారు బీజేపీ నేత విజయశాంతి. తెలంగాణను అత్యంత తీవ్రంగా వ్యతిరేకించి, తెలంగాణవాదాన్ని అణచివేయాలని ప్రయత్నించిన వారు వేదికపై వున్నారంటూ ఆమె వ్యాఖ్యానించారు. 

తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి శుక్రవారం ప్రమాణ స్వీకారం చేసిన సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమానికి పార్టీ నేతలు, కార్యకర్తలు భారీగా తరలివచ్చి కిషన్ రెడ్డికి అభినందనలు తెలిపారు. అయితే సీనియర్ నేత, మాజీ ఎంపీ విజయశాంతి ఈ కార్యక్రమం మధ్యలోనే వెళ్లిపోవడం కలకలం రేపింది. దీనిపై మీడియాలో రకరకాలుగా కథనాలు వచ్చాయి. ఈ నేపథ్యంలో రాములమ్మ స్పందించారు.

 

 

సమావేశం మధ్యలోనే వెళ్లిపోయాననడం సరికాదని.. కిషన్ రెడ్డిని కలిసి అభినందించానని తలిపారు. తెలంగాణను అత్యంత తీవ్రంగా వ్యతిరేకించి, తెలంగాణవాదాన్ని అణచివేయాలని ప్రయత్నించిన వారు వేదికపై వున్నారంటూ మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డిని విజయశాంతి అన్నారు. తనకు అసౌకర్యంగా వున్నందునే అక్కడి నుంచి వెళ్లిపోయానని ఆమె ట్వీట్ చేశారు. చివరి వరకు ఉండలేకపోయానని అన్నారు.

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు జరుగుతున్న సమయంలో కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును వ్యతిరేకించారు. తెలంగాణ విడిపోతే కరెంట్ కష్టాలు తప్పవని ఆయన హెచ్చరించారు. ఇటీవల ఆయన బిజెపిలో చేరారు. 
 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Summer Effect: తెలంగాణ లో ఈ జిల్లాలకు అలెర్ట్ రానున్న మూడు రోజుల్లో తీవ్ర వేడి | Asianet News Telugu
Job Mela 2026 : తెలుగు యువతకు సూపర్ ఛాన్స్.. మే 2026 లో భారీ ఉద్యోగాల భర్తీ.. ఏరోజు, ఏ జిల్లాలో, ఎన్ని జాబ్స్..?