బండి సంజయ్ రాజీనామా.. ఈటల రాజేందర్‌కు బీజేపీలో కీలక పదవి

Siva Kodati |  
Published : Jul 04, 2023, 03:21 PM IST
బండి సంజయ్ రాజీనామా.. ఈటల రాజేందర్‌కు బీజేపీలో కీలక పదవి

సారాంశం

తెలంగాణ బీజేపీ ఎన్నికల నిర్వహణ కమిటీ ఛైర్మన్‌గా ఈటల రాజేందర్‌ను నియమిస్తూ హైకమాండ్ ఆదేశాలు జారీ చేసింది. 

తెలంగాణ బీజేపీలో మంగళవారం అనూహ్య మార్పులు చోటు చేసుకున్నాయి. రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా బండి సంజయ్ రాజీనామా చేశారు. ఆ వెంటనే తెలంగాణ బీజేపీ కొత్త అధ్యక్షుడిగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి బాధ్యతలు అప్పగించింది హైకమాండ్. మరోవైపు తనకు బీజేపీలో సరైన ప్రాధాన్యత లభించడం లేదంటూ అలకబూనిన మాజీ మంత్రి, హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌కు సైతం కీలక బాధ్యతలను కట్టబెట్టింది అధిష్టానం. తెలంగాణ బీజేపీ ఎన్నికల నిర్వహణ కమిటీ ఛైర్మన్‌గా ఈటల రాజేందర్‌ను నియమిస్తూ ఆదేశాలు జారీ చేసింది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది. 


 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Rain Alert : ఈ వర్షాలు ట్రైలర్ మాత్రమే, అసలు సినిమా ముందుంది... ఈ జిల్లాల్లో డేంజర్ వానలు, బిఅలర్ట్
TG SSC Results: కాసేప‌ట్లో తెలంగాణ ప‌దో త‌ర‌గ‌తి ఫ‌లితాలు.. అంద‌రి కంటే ముందు వాట్సాప్‌లో ఇలా తెలుసుకోండి