ఖమ్మంలో తీవ్ర ఉద్రిక్తత.. ప్రభుత్వ ఆస్పత్రిపై బీజేపీ కార్యకర్తల దాడి..

Published : Apr 16, 2022, 03:30 PM IST
 ఖమ్మంలో తీవ్ర ఉద్రిక్తత.. ప్రభుత్వ ఆస్పత్రిపై బీజేపీ కార్యకర్తల దాడి..

సారాంశం

ఖమ్మంలో పోలీసుల వేధిస్తున్నారని సాయి గణేష్ ఆత్మహత్య చేసుకున్న ఘటన రాజకీయంగా తీవ్ర కలకలం రేపుతోంది. ఈ క్రమంలోనే ఖమ్మం టెన్షన్ వాతావరణం చోటుచేసుకుంది. 

ఖమ్మంలో పోలీసుల వేధిస్తున్నారని సాయి గణేష్ ఆత్మహత్య చేసుకున్న ఘటన రాజకీయంగా తీవ్ర కలకలం రేపుతోంది. బీజేపీ మజ్జూరు సంఘం జిల్లా అధ్యక్షునిగా  ఉన్న సాయి గణేష్ మృతితో ఆ పార్టీ శ్రేణులు ఆందోళనకు దిగాయి. మంత్రి పువ్వాడ అజయ్‌ ఒత్తిడితో పోలీసులు తప్పుడు కేసులు పెట్టడం వల్లే సాయి గణేష్ ఆత్మహత్య చేసుకున్నాడని బీజేపీ శ్రేణులు ఆరోపిస్తున్నారు. అయితే ఖమ్మం ప్రభుత్వ ఆస్పత్రిలో సాయి గణేష్‌ మృతదేహానికి పోస్టుమార్టమ్ ఆలస్యం చేస్తున్నారని బీజేపీ నేతలు, కార్యకర్తలు ప్రభుత్వ ఆస్పత్రిపై దాడి చేశారు. ఆస్పత్రి అద్దాలు ధ్వంసం చేశారు. దీంతో పోలీసులు, బీజేపీ కార్యకర్తల మధ్య తోపులాట చోటుచేసుకుంది. 

నగరంలో టీఆర్‌ఎస్ నాయకుల ఫ్లెక్సీలకు బీజేపీ కార్యకర్తలు నిప్పు పెట్టారు. మంత్రి పువ్వాడ అజయ్ కుమార్‌కు, పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. మృతిచెందిన సాయి గణేష్ కుటుంబానికి న్యాయం చేయాలని నినాదాలు చేస్తున్నారు. దీంతో ఖమ్మం నగరంలో టెన్షన్ వాతావరణం చోటుచేసుకుంది. అయితే పోలీసులు మాత్రం లంచ్ టైమ్ కావడంతో పోస్టుమార్టమ్ ప్రక్రియ ఆలస్యం అయిందని చెబుతున్నారు. 

ఇక, ఫ్లెక్సీ చింపుతుండగా ఓ తమ కార్యకర్తపై టీఆర్ఎస్ శ్రేణులు దాడులు చేశాయని బీజేపీ కార్యకర్తలు ఆరోపించారు. అయితే గాయపడినట్టుగా చెబుతున్న బీజేపీ కార్యకర్త.. ఆత్మహత్య చేసుకునేందుకు యత్నించగా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 

ఇక, సాయి గణేష్ అనే యువకుడు బీజేపీ మజ్జూరు సంఘం ఖమ్మం జిల్లా అధ్యక్షునిగా ఉన్నాడు. పోలీసులు అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారంటూ సాయి గణేష్ ఖమ్మం త్రీటౌన్ పోలీస్ స్టేషన్ ముందు పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించాడు. దీంతో అతడిని ఖమ్మంలోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. అయితే పరిస్థితి విషమంగా ఉండటంతో.. హైదరాబాద్‌లోని యశోద ఆస్పత్రికి తరలించారు. అయితే పరిస్థితి విషమించడంతో సాయి గణేష్ మృతిచెందాడు. దీంతో సాయి గణేష్ మృతదేహాన్ని నేడు ఖమ్మం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. 

అయితే అధికార పార్టీ నేత ఒత్తిడితో కేసులు పెట్టారని ఆరోపణలు వస్తున్నాయి. సాయి గణేష్‌పై పోలీసులు 16 కేసులు పెట్టినట్టుగా తెలుస్తోంది. ఇక, సాయి గణేష్ ఖమ్మం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సమయంలో బీజేపీ కిసాన్‌ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు కొండపల్లి శ్రీధర్‌రెడ్డి, పార్టీ జిల్లా అధ్యక్షుడు గల్లా సత్యనారాయణతోపాటు పలువురు పరామర్శించారు. ఈ విషయం బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌కు తెలియజేసి.. ఆయన సూచన మేరకు మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్‌లోని ఆస్పత్రికి తరలించినట్టుగా బీజేపీ నేతలు చెప్పారు. 

సాయి గణేష్‌ ఆత్మహత్యకు యత్నించడానికి కారకులైన పోలీసులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తూ బీజేపీ నేతలు ప్రదర్శనగా ఖమ్మం ఏసీపీ కార్యాలయానికి చేరుకుని ధర్నా చేశారు. ఈ నెల 18న ఖమ్మంలో కేటీఆర్ పర్యటనను అడ్డుకుంటామని నినాదాలు చేశారు. స్థానిక మంత్రి ఒత్తిడితోనే పోలీసులు తప్పుడు కేసులు పెట్టారని బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు.  

సాయిగణేష్‌ను పోలీసులు, టీఆర్‌ఎస్ నేతలు తీవ్రంగా వేధించారని అతని కుటుంబ సభ్యులు తెలిపారు. స్థానికంగా ఎదగనివ్వమని బెదిరించారని ఆరోపించారు. తమకు న్యాయం చేయాలని డిమాండ్‌ చేశారు. 

తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ స్పందించారు. సాయి గణేష్‌పై 16 కేసులు పెట్టారని అన్నారు. బీజేపీ కార్యకర్త కాబట్టే పీడీ యాక్ట్ పెట్టారని విమర్శించారు. మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ బలు పెక్కి బరితెగించాడని మండిపడ్డారు. మంత్రి అవినీతిని సాయి గణేష్‌ ప్రశ్నించాడని.. ఇది మంత్రి పువ్వాడ, పోలీసులు చేసిన హత్య అని ఆరోపించారు. 
 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Cold Wave Alert : ఈ మూడ్రోజులు తస్మాత్ జాగ్రత్త.. ఈ ప్రాంతాలకు పొంచివున్న చలిగండం..!
Hyderabad రోడ్లకు ట్రంప్, రతన్ టాటా పేర్లు… రేవంత్ సర్కార్ కొత్త స్ట్రాటజీ ఏంటి?