ఆగస్ట్ 1న భార్యా బాధితుల సంఘం సమావేశం.. ప్రభుత్వానికి తెలిపేలా...

By AN TeluguFirst Published Jul 29, 2021, 11:11 AM IST
Highlights

ఆ రోజు ఉదయం 9 గంటలకు సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో భారత భార్య బాధితుల సంఘం సమావేశం జరుగుతుందని,  ఈ సందర్భంగా కోర్ కమిటీ వేసి డివిజన్లుగా ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు.

హైదరాబాద్ : భారత భార్య బాధితుల సంఘం ఆధ్వర్యంలో ఆగస్టు 1న సమావేశం జరగనుంది. ఈ మేరకు సమావేశంనిర్వహిస్తున్నట్లు సంఘం జాతీయ అధ్యక్షులు జి బాలాజీ రెడ్డి తెలిపారు. 

ఆ రోజు ఉదయం 9 గంటలకు సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో భారత భార్య బాధితుల సంఘం సమావేశం జరుగుతుందని,  ఈ సందర్భంగా కోర్ కమిటీ వేసి డివిజన్లుగా ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు.

భార్యా బాధితులు సమావేశానికి హాజరై  అనుభవిస్తున్న బాధలు, ఆవేదనలు ప్రభుత్వానికి, పార్లమెంటుకు తెలియజేయడానికి సహకరించాలని కోరారు. ఆసక్తి ఉన్నవారు 709343730  నెంబర్ లో సంప్రదించాలని  బాలాజీ రెడ్డి కోరారు.
 

click me!