ఎస్టీలకు 10 శాతం రిజర్వేషన్లు ఇవ్వకుంటే కేసీఆర్ పురుగులు పడి పోతాడు: బండి సంజయ్

By Sumanth KanukulaFirst Published Sep 20, 2022, 4:21 PM IST
Highlights

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఎస్టీలకు 10 శాతం రిజర్వేషన్లు ఇవ్వకుంటే కేసీఆర్ పురుగులు పడి పోతాడని అన్నారు.

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఎస్టీలకు 10 శాతం రిజర్వేషన్లు ఇవ్వకుంటే కేసీఆర్ పురుగులు పడి పోతాడని అన్నారు. ప్రస్తుతం బండి సంజయ్ నాలుగో విడత ప్రజాసంగ్రామ యాత్ర ఉప్పల్‌లో కొనసాగుతుంది. ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ.. ఎస్టీలకు రిజర్వేషన్లు అమలు కాకుండా కేసీఆర్ కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. బీజేపీపై నెపం నెట్టి సుప్రీం కోర్టుకు వెళ్లి స్టే తేవాలని కేసీఆర్ ప్లాన్ చేశారని విమర్శించారు. దమ్ముంటే.. ఎస్టీ రిజర్వేషన్ల అమలుపై ప్రమాణం చేయడానికి రావాలని సవాలు విసిరారు. 

కాంగ్రెస్‌తో కలిసి రాష్ట్రపతి ఎన్నికల్లో ద్రౌపది ముర్మును ఓడించేందుకు ప్రయత్నించిన కేసీఆర్.. ఎస్టీల గురించి మాట్లాడటం సిగ్గుచేటని బండి సంజయ్ అన్నారు. ప్రజా సమస్యలు పట్టిచుంకోని ఏకైక సీఎం కేసీఆర్ అని విమర్శించారు. లిక్కర్ సహా అన్ని స్కామ్‌ల్లో కేసీఆర్ కుటుంబమే ఉందని ఆరోపించారు. క్వారంటైన్ పేరుతో ఏ స్కామ్‌కు స్కెచ్ వేస్తున్నారో అని సెటైర్లు వేశారు. 

click me!