తెలంగాణ నూతన అడ్వోకేట్ జనరల్ గా బీఎస్ ప్రసాద్

Published : Aug 10, 2018, 05:42 PM ISTUpdated : Sep 09, 2018, 01:59 PM IST
తెలంగాణ నూతన అడ్వోకేట్ జనరల్ గా బీఎస్ ప్రసాద్

సారాంశం

తెలంగాణ ప్రభుత్వం నూతన అడ్వోకేట్ జనరల్ ని నియమించింది. హైకోర్టు సీనియర్ న్యాయవాది బండ శివానంద ప్రసాద్ ను నియమిస్తూ తెలంగాణ సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో గత కొంత కాలంగా ఖాళీగా వున్న ఈ పోస్టు భర్తీ అయ్యింది.   

తెలంగాణ ప్రభుత్వం నూతన అడ్వోకేట్ జనరల్ ని నియమించింది. హైకోర్టు సీనియర్ న్యాయవాది బండ శివానంద ప్రసాద్ ను నియమిస్తూ తెలంగాణ సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో గత కొంత కాలంగా ఖాళీగా వున్న ఈ పోస్టు భర్తీ అయ్యింది. 

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కేసీఆర్ ప్రభుత్వం రాష్ట్ర అడ్వోకేట్ జనరల్ గా దేశాయ్ ప్రకాశ్ రెడ్డిని నియమించుకున్నారు. అయితే ఇటీవల కాలంలో జరిగిన పరిణామాల నేపథ్యంలో ఆయన తన పదవికి ఈ ఏడాది మార్చి 26 న రాజీనామా చేసిన విషయం తెలిసిందే. అతడి రాజీనామాను ఆమోదించిన ప్రభుత్వం అప్పటినుండి నూతన అడ్వోకేట్ జనరల్ కోసం వేట సాగించింది.

అయితే ప్రభుత్వం తరపున వాదించడానికి సీనియారిటీ తో బాగా మంచి ట్రాక్ రికార్డు ఉన్న న్యాయవాది కోసం ప్రభుత్వం వెదికింది. ఇలా దాదాపు నాలుగు నెలల తర్వాత ఎట్టకేలకు జనగామ వాసి బీఎస్ ప్రసాద్ ను ఎంపికచేసింది. ఇందుకోసం సీఎం కేసీఆర్ ఆమోదం తెలుపుతూ ఏజీ నియామక దస్త్రంపై సంతకం చేశారు. దీంతో అధికారులు నూతన ఏజీగా బీఎస్ ప్రసాద్ నియమిస్తున్నట్లు ఉత్తర్వులు జారీ చేశారు.
 

PREV
click me!

Recommended Stories

శ్రీ సత్యసాయి ట్రస్ట్ కార్యక్రమంలో పాల్గొన్న హీరో విజయ్ దేవరకొండ | Asianet News Telugu
Vijay Deverakonda Superb Speech: విజయ్ దేవరకొండ స్పీచ్ కి సభ మొత్తం అరుపులే | Asianet News Telugu