బాలాపూర్ లడ్డు వేలం పాట 1994లో ప్రారంభమైంది. బాలాపూర్ గణేష్ ఉత్సవ సమితిగా ఏర్పాటై బాలాపూర్ లో గణేష్ వినాయక విగ్రహన్ని ఏర్పాటు చేసి లడ్డు వేలం పాటను నిర్వహిస్తున్నారు.
బాలాపూర్: బాలాపూర్ లడ్డు వేలం పాట 1994లో ప్రారంభమైంది. బాలాపూర్ గణేష్ ఉత్సవ సమితిగా ఏర్పాటై బాలాపూర్ లో గణేష్ వినాయక విగ్రహన్ని ఏర్పాటు చేసి లడ్డు వేలం పాటను నిర్వహిస్తున్నారు. ఈ ఏడాది బాలాపూర్ లో గణేష్ వేలం పాట సిల్వర్ జూబ్లీ ఈయర్ కు చేరుకొంది.
ప్రతి ఏటా బాలాపూర్ లడ్డు వేలంలో పాల్గొనేందుకు ఆసక్తి చూపుతున్నారు. దీంతో లక్షలాది రూపాయాలకు పోటీ పడి లడ్డును దక్కించుకొంటున్నారు తొలుత వందల్లో ఉన్న లడ్డు వేలం పాట... ప్రస్తుతం లక్షలకు చేరుకొంది.
ఈ లడ్డును దక్కించుకొన్నవారికి మంచి జరుగుతోందనే భావనతో ప్రతి ఏటా వేలంలో పాల్గొనేందుకు ఎక్కువ మంది ఆసక్తి చూపుతుంటారు. బాలాపూర్ లడ్డును అత్యధికంగా కొలను కుటుంబీకులు దక్కించుకొన్నారు.బాలాపూర్ కు చెందిన కొలను కుటుంబీకులు 8 దఫాలు ఈ లడ్డును వేలంపాటలో దక్కించుకొన్నారు.
తొలిసారి 1994లో జరిగిన వేలం పాటలో కొలను మోహన్ రెడ్డి కుటంబం రూ.450 దక్కించుకొంది. 1995లో కూడ కొలనుమోహాన్ రెడ్డి కుటుంబం రూ4500లకు లడ్డును దక్కించుకొంది. 1996లో కొలను కృష్ణారెడ్డి రూ.18వేలకు దక్కించుకొన్నారు. 1997లో కొలను కృష్ణారెడ్డి రూ.28వేలకు దక్కించుకొన్నారు. 1998లో కొలను మోహన్ రెడ్డి రూ. 51వేలకు దక్కించుకొన్నారు.1998లో కళ్లెం ప్రతాప్ రెడ్డి రూ.65వేలకు లడ్డును దక్కించుకొన్నారు.
1999లో కళ్లెం అంజిరెడ్డి రూ.66వేలకు లడ్డును దక్కించుకొన్నారు.2000లో జి. రఘునందన్ చారి రూ.85వేలకు లడ్డును దక్కించుకొన్నారు.2001లో కందాడ మాధవరెడ్డి రూ.1.05లక్షలకు లడ్డును దక్కించుకొన్నాడు.2002లో చిగురంత తిరుపతిరెడ్డి రూ.1.55లక్షలకు లడ్డును దక్కించుకొన్నాడు. 2003లోకొలను మోహన్ రెడ్డి రూ.2.01లక్షలకు లడ్డును దక్కించుకొన్నాడు.
2004లోఇబ్రహీం శేఖర్ రూ.2.08లక్షలకు లడ్డును దక్కించుకొన్నాడు. 2005లో చిగురంత తిరుపతి రెడ్డి రూ.3 లక్షలకు లడ్డును దక్కించుకొన్నాడు. 2006లో జి.రఘునందన్ చారి రూ.4.15లక్షలకు దక్కించుకొన్నాడు.2007లో కొలను మోహన్ రెడ్డి రూ. 5.07 లక్షలకు లడ్డును దక్కించుకొన్నారు.2008లో సరిత రూ.5.10లక్షలకు దక్కించుకొన్నారు.
2009లో కొడలి శ్రీధర్ బాబు రూ. 5.35లక్షలకు దక్కించుకొన్నారు.2010లో కొలను బ్రదర్స్ కు రూ. 5.45లక్షలకు దక్కించుకొన్నారు. 2011లో రూ.పన్నాల గోవర్థన్ రూ. 7.50లక్షలకు దక్కించుకొన్నారు. 2012లో తీగల కృష్ణారెడ్డి రూ.9.26లక్షలకు లడ్డును దక్కించుకొన్నారు.2013లో సింగిరెడ్డి జైహింద్ రెడ్డి రూ. 9.50లక్షలను లడ్డును దక్కించుకొన్నారు.
2014లో కళ్లెం మదన్ మోహాన్ రెడ్డి రూ. 10.32 లక్షలకు లడ్డును దక్కించుకొన్నారు. 2015లో స్కైలాబ్ రెడ్డి రూ. 14.65లక్షలకు దక్కించుకొన్నారు. 2016లో నాగం తిరుపతి రెడ్డి రూ.15.60 లక్షలకు దక్కించుకొన్నారు. ఈ ఏడాది శ్రీనివాస్ గుప్తా రూ.16.60లక్షలకు దక్కించుకొన్నారు.
ఈ వార్తలు చదవండి
బాలాపూర్ లడ్డు రికార్డు ధర : రూ. 16.60లక్షలకు దక్కించుకొన్న శ్రీనివాస్ గుప్తా