మైనర్ బాలికపై ఆటో డ్రైవర్ అత్యాచారం..!

By telugu news teamFirst Published Dec 15, 2020, 10:03 AM IST
Highlights

పాత బస్టాండ్‌లో బిక్షాటన చేసుకొని ఇంటికి వెళ్లేందుకు బాలిక ఆటో ఎక్కింది. బలవంతంగా ఆటోలో పెద్ద చెరువు సమీపంలోకి  తీసుకెళ్లిన ఆటో డ్రైవర్.. దారుణానికి పాల్పడ్డాడు. 

కామారెడ్డి జిల్లా కేంద్రంలో దారుణం చోటుచేసుకుంది. మైనర్ బాలికపై ఆటో డ్రైవర్ అత్యాచారానికి పాల్పడ్డాడు. కాగా.. ఆ ఆటో డ్రైవర్ ఎవరు అనే విషయం మాత్రం తెలియలేదు. పాత బస్టాండ్‌లో బిక్షాటన చేసుకొని ఇంటికి వెళ్లేందుకు బాలిక ఆటో ఎక్కింది. బలవంతంగా ఆటోలో పెద్ద చెరువు సమీపంలోకి  తీసుకెళ్లిన ఆటో డ్రైవర్.. దారుణానికి పాల్పడ్డాడు. 

అత్యాచారానికి గురైన మైనర్ బాలిక సదాశివనగర్ మండలం అడ్లూర్ ఎల్లారెడ్డికి చెందిన బాలికగా గుర్తించారు. బాలిక తల్లి  ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. కాగా.. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. 
 

click me!