బిసి కమిషన్ సభ్యుల ప్రమాణ స్వీకారం

Published : Oct 27, 2016, 11:56 PM ISTUpdated : Mar 25, 2018, 11:51 PM IST
బిసి కమిషన్ సభ్యుల ప్రమాణ స్వీకారం

సారాంశం

బిసి కమిషన్ చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించిన రాములు

 బిసి కమిషన్ ఛైర్మన్,  సభ్యులు  ఈ రోజు ప్రమాణస్వీకారం చేశారు. కమిషన్ ఛైర్మన్‌గా బిఎస్ రాములు, సభ్యులుగా జూలూరి గౌరి శంకర్, అంజనేయులుగౌడ్, వకుళాభరణం కృష్ణమోమన్‌రావు ప్రమాణస్వీకారం చేశారు. ఈ కార్యక్రమాన్ని రవీంద్రభారతిలో నిర్వహించారు. ప్రమాణస్వీకార కార్యక్రమానికి మంత్రులు ఈటల రాజేందర్, జోగు రామన్న,ఎంపీ బాల్క సుమన్, ఎమ్మెల్యే గాదరి కిషోర్‌తోపాటు పలువురు నేతలు హాజరయ్యారు. ఛైర్మన్ రాములుకు, ముగ్గురు సభ్యులకు అభినందనలు తెలిపారు. బిఎస్ రాములు తెలంగాణలో బాగా పేరున్న రచయిత, సామాజిక తత్వవేత్త. తెలంగాణ ప్రజా ఉద్యమాలతో బలమైన సంబంధాలున్న వ్యక్తి. 

PREV
click me!

Recommended Stories

ప్రజా ఆశీర్వాద సభలో కేసీఆర్ పవర్ ఫుల్ స్పీచ్ | KCR Powerful Speech at Praja Ashirvada Sabha
KCR: నా కొడకా.. నా చావు కోరుకుంటావా? వెయ్యి జన్మలెత్తినా నన్ను ఏమీ చేయలేరు ! కేసీఆర్ మాస్ కౌంటర్