బాబ్రీ మ‌సీదుపై లోక్ స‌భ‌లో అసదుద్దీన్ ఓవైసీ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

By Mahesh RajamoniFirst Published Feb 10, 2024, 7:31 PM IST
Highlights

Asaduddin Owaisi:  దేవాలయాల కూల్చివేతలో మొఘల్ చక్రవర్తి బాబర్ పాత్ర గురించి బీజేపీ ఎంపీలు ప్రశ్నలు లేవనెత్తిన సమయంలో.. అసదుద్దీన్ ఓవైసీ  సమాధానమిస్తూ.. మొఘల్ చక్రవర్తుల ప్రతినిధినా.. ఈ దేశంలో ప్రభుత్వానికి మతం ఉందా?" అని ప్రశ్నించారు.
 

Asaduddin Owaisi: హైదబాద్ ఎంపీ, ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ మరోసారి ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంలోని ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ తీవ్ర విమర్శలు గుర్తించారు. అయోధ్యలోని రామ మందిరప్రాణ ప్రతిష్ట నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోడీ, బీజేపీ ఎంపీలు చేసిన వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ ఆయన విమర్శలు గుర్తించారు. ఈ సంఘటన ఒక మతం మీద మరొక మతం సాధించిన విజయమా అని ఓవైసీ ప్రశ్నించారు. అలాగే, బాబ్రీ మ‌సీదు జిందాబాద్‌.. భార‌త్ జిందాబాద్ అంటూ ఆయ‌న లోక్‌స‌భ‌లో నినాదం చేశారు.

"ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం ఒక మతానికి చెందినదా లేక అందరికీ చెందినదా? అని నేను అడగాలనుకుంటున్నాను. ఇప్పుడు రామాలయం కట్టినా బాబ్రీ మసీదు ఉన్న ప్రదేశం అలాగే ఉంటుందని నా విశ్వాసం చెబుతోంది" అని లోక్‌సభలో రామమందిరంపై అసదుద్దీన్ ఒవైసీ అన్నారు. దేవాలయాలను ధ్వంసం చేయడంలో మొఘల్ చక్రవర్తి బాబర్ పాత్రపై బీజేపీ ఎంపీలు ప్రశ్నించగా.. ఒవైసీ స్పందిస్తూ.. మొఘల్ చక్రవర్తుల ప్రతినిధినా అని ప్రశ్నించారు. "నేను బాబర్, జిన్నా లేదా ఔరంగజేబు ప్రతినిధినా? నేను రాముడిని గౌరవిస్తాను కానీ హే రామ్ అని చివరి మాటలు చెప్పిన వ్యక్తిని చంపిన నాథూరామ్ గాడ్సేను నేను ద్వేషిస్తున్నాను" అని ఓవైసీ అన్నారు.

అలాగే, బాబ్రీ మసీదు చిరకాలం జీవించే వుంటుందని అన్న. భారత్‌తో జీవించి వుంటుంది. అలాగే జీవించండి, జై హింద్" అని చర్చ సందర్భంగా ఓవైసీ అన్నారు. ఆర్టికల్ 370పై సుప్రీంకోర్టు 2019 తీర్పును కూడా ఒవైసీ విమర్శించారు. ఇది "అత్యంత దారుణమైన చర్య" అని పేర్కొన్నారు. బాబ్రీ మసీదు కూల్చివేత 1992 డిసెంబర్ 6 నాటి సంఘటనలపై ప్రధాని మోడీ నేతృత్వంలోని ప్రభుత్వం వైఖరిని విమ‌ర్శించారు. కాగా, ఏఐఎంఐఎం ఎంపీ ఓవైసీ చేసిన వ్యాఖ్యలపై ఆర్ఎస్ ఛైర్‌పర్సన్ రాజేంద్ర అగర్వాల్ తీవ్రంగా ప్రతిస్పందించారు. ప్రభుత్వం డిసెంబర్ 6న రామాలయ ప్రారంభోత్సవాన్ని మాత్రమే జరుపుకున్న‌ద‌నీ, ఏ పండుగా కాదని మండిప‌డ్డారు. 

 

| During the discussion on the construction of the historic Ram Temple and Pran Pratishta begins in Lok Sabha, AIMIM MP Asaduddin Owaisi says "I want to ask if Modi Govt is the government of a particular community, religion or the government of the entire country? Does GoI… pic.twitter.com/cU6tS1WIxu

— ANI (@ANI)


 

click me!