నా భర్తను కిడ్నాప్ చేసి, చంపించాడు.. వామనరావు హత్య కేసులో మరో ట్విస్ట్.. (వీడియో)

By AN TeluguFirst Published Feb 20, 2021, 4:55 PM IST
Highlights

రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపిన మంథని లాయర్ వామనరావు హత్య కేసులో మరో ట్విస్ట్ బయటపడింది. వామనరావుకు హంతక చరిత్ర ఉందంటూ అరుణజ్యోతి అనే మహిళ ప్రెస్ మీట్ పెట్టారు. 

రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపిన మంథని లాయర్ వామనరావు హత్య కేసులో మరో ట్విస్ట్ బయటపడింది. వామనరావుకు హంతక చరిత్ర ఉందంటూ అరుణజ్యోతి అనే మహిళ ప్రెస్ మీట్ పెట్టారు. 

"

రెండు రోజుల క్రితం అడ్వకేట్ దంపతులు దారుణ హత్యకు గురైన విషయం తెలిసిందే. ఇందులో ఒకరైన వామనరావుకు కూడా హంతక చరిత్ర ఉందని, కరీంనగర్ కు చెందిన నీటి పారుదల శాఖ విశ్రాంత ఉద్యోగి భార్య అరుణజ్యోతి ఆరోపించారు. శనివారం నగరంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ… ‘నా కుమారుడికి ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి 2008లో నా భర్త వద్ద రూ.1.50 లక్షలు తీసుకున్నాడు. అనంతరం ఉద్యోగం ఇప్పించక పోవటంతో డబ్బులు తిరిగి ఇవ్వాలని నా భర్త ఒత్తిడి తెచ్చారు.

దీంతో నగర శివారులోని అలుగునూర్ వద్ద నా భర్తను కిడ్నాప్ చేసి, అక్కడి నుంచి నల్గొండ జిల్లా వలిగొండ గ్రామంలో హత్య చేశాడు. ఏడాది అనంతరం హత్యోదంతం వెలుగులోకి రావడంతో అప్పటి హోంమంత్రితో పాటు పలువురు ప్రజాప్రతినిధులు, పోలీసులకు పిర్యాదు చేసినా పట్టించుకోలేదు. 

నా భర్త హత్యపై నల్గొండ జిల్లాలో కేసు కూడా నమోదు అయినా, ఎలాంటి చర్యలు చేపట్టలేదు. నా లాగే, అనేకమంది వామనరావు బాధితులు ఉన్నారని, తగిన విచారణ జరిపితే వాస్తవాలు వెలుగు చూస్తాయని ఆమె చెప్పుకొచ్చారు. అంతేకాదు పోలీసు అధికారులు లోతుగా విచారించి, బాధితులకు న్యాయం చేయాలని కోరారు. 

click me!